అన్వేషించండి

Top Headlines: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు - తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు, వైసీపీకి మరో షాక్

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఉన్న టాప్ హెడ్ లైన్స్ ఇక్కడ చదివేయండి.

Top Headlines On March 17th In Telugu States: 

1. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ  ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బరిలో నిలిపారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు  బిఆర్ఎస్ పార్టీ  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆధార్‌ కార్డు తరహాలో డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే జులై (July) నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డుల (Health profile cards) ను ఇస్తామని రాష్ట్ర ఐటీ, శాసనసభ  వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister sridhar babu) ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు సత్కార్‌ సభ జరిగింది. ఈ సభలో కీలక ప్రకటన చేశారు మంత్రి శ్రీధర్‌బాబు. ప్రజా సంక్షేమం,  అభివృద్ధి కోసం, ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3. మీడియా సంస్థలకు కేటీఆర్ బామ్మర్ది నోటీసులు

తనపై దుష్ప్రచారం చేశారంటూ మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజేంద్రప్రసాద్ పాకాల నోటీసులు పంపించారు. ఫిబ్రవరి నెలలో రాడిసన్ హోటల్ లో దొరికిన డ్రగ్స్ కేసు (Radisson Hotel Drugs Case)లో తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ రాజేంద్రప్రసాద్ 16 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు  పంపారు. ఒక్కో మీడియా సంస్థపైన 10 కోట్ల దావా కింద.. మొత్తంగా రూ.160 కోట్లకు దావా వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4. వైసీపీకి మరో షాక్

ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ZPTC గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం సోమవారం నాడు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5. రిటైర్డ్ బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో భారీగా డిఫెన్స్ లిక్కర్ పట్టివేత

అనంతపురం జిల్లా కేంద్రంలో ఒక రిటైర్డ్ జవాన్ (BSF Jawan) ఇంట్లో భారీగా డిఫెన్స్ మద్యాన్ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం (Anantapur) నగరంలోని శిల్ప లేపక్షి నగర్ లో ఉంటున్న బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవాన్ ఇంటి మీద మెరుపు దాడులు చేసి ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 303 డిఫెన్స్ లిక్కర్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Advertisement

వీడియోలు

Nandamuri Balakrishna Rings The Bell At NSE | నేషనల్ స్టాంక్ ఎక్స్ఛేంజ్ గంట కొట్టిన బాలయ్య | ABP Desam
Space Time and Space Fabric Explained | ఐన్ స్టైన్ ఎంత జీనియస్సో ప్రూవ్ అయిన సందర్భం | ABP Desam
Rohit Virat in Australia ODI Series | ఆస్ట్రేలియా సిరీస్ లో రో-కో ?
South Africa vs England ODI | సౌతాఫ్రికా ఘోర పరాజయం
India Won Hockey Asia Cup 2025 | హాకీ ఆసియా కప్ విజేతగా భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati-Shirdi Train: తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
తిరుపతి-షిర్డీ మధ్య ప్రతి రోజూ ట్రైన్- చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 
Andhra Pradesh Latest News: కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
కాకినాడ పోర్టులో 17,293 మెట్రిక్ టన్నుల యూరియా - చంద్రబాబు కీలక ఆదేశాలు- దర్నాకు సిద్ధమైన వైసీపీ 
AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
Hyderabad drugs case: కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
కూలీగా చేరి వేల కోట్ల డ్రగ్స్ ముఠాను పట్టేసిన ముంబై కానిస్టేబుల్ - సినిమా కథ కాదు చర్లపల్లిలో జరిగిందే !
Nepal Gen Z outcry: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్ - పిచ్చెక్కినట్లు యువత అలజడి - కాల్చి చంపుతున్న నేపాల్ ఆర్మీ
Tesla drops: అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
అమెరికాలోనూ కరిగిపోతున్న టెస్లా మార్కెట్ షేర్ - ఇక మస్క్ EV కింగ్ కాదు !
Adilabad Cement Factory: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై చిగురించిన ఆశలు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక నిర్ణయం
TG CPGET Results: తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
తెలంగాణ CPGET ఫలితాలు విడుదల! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే! 
Embed widget