అన్వేషించండి

Kamareddy Collector: కలెక్టర్ వాహనంపై 28 చలానాలు... వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు..

నిబంధనలు సామాన్యులకే అధికారులు కాదనేది మరోసారి రుజువైందంటున్నారు ప్రజలు. ఒక్క చలానా ఉన్నా వాహనం జప్తు అనే పోలీసులు కలెక్టర్ వాహనంపై 28 చలానాలు పెండింగ్ ఉన్నా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

సామాన్యుల వాహనంపై ఒక్క చలానా పెండింగ్ లో ఉంటే బండి స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. ఈ రూల్ సామాన్యులకే పరిమితమా... అధికారంలో ఉన్నవాళ్లకు, అధికారులకు వర్తించవా అంటున్నారు ప్రజలు. ప్రజలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉన్నతాధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనంపై  ఏకంగా 28 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Also Read:  ఫకీర్ మాటలు బంద్ చేయండి.. సీఎం కేసీఆర్‌కు ఢిల్లీలో అలా అవమానం: మంత్రి ఎర్రబెల్లి

గత కలెక్టర్ల సమయంలో చలానాలు 

సామాన్యుల వాహనాలకు ఒకటి, రెండు చలాన్లు పెండింగ్ లో ఉంటే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డుపై ఆపి మరి చలానాలు కట్టించుకుంటున్నారు. అదే జిల్లా కలెక్టర్ వాహనంపై 28 చలానాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు, అధికారులకు నిబంధనలు వేరుగా ఉంటాయా అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. సామాన్యులు తమ చలానాలను ఇంటికి వెళ్లి కడతామని చెప్పినా, పోలీసులను వేడుకున్నా వదలకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కానీ ఒక జిల్లా కలెక్టర్ వాహనానికి 28 చలానాలు పెండింగ్ లో ఉంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో 28 చలానాల్లో 15 చలానాలు చెల్లించారు అధికారులు. ప్రస్తుతం కలెక్టర్ వాహనంపై 13 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈ చలానాలు గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన సత్యనారాయణ, శరత్ సమయంలో పడినట్లు తెలుస్తోంది. 

Also Read: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష

వార్త వైరల్ అవ్వడంతో 15 చలానాలు చెల్లింపు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం (TS16 EE3366)పై 28 చలానాలు పడ్డాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 మధ్య ఈ మొత్తం చలానాలు పడ్డాయని తెలుస్తోంది. ఈ చలానాలకు రూ.27,580 జరిమానా పడింది. ఇందులో అధిక వేగంతో వాహనం నడపడం వల్ల 24 చలానాలు పడ్డాయి. ఈ వార్త వైరల్‌ అవ్వడంతో 15 చలానాలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇంకా కలెక్టర్ వాహనంపై 2019 నుంచి 2021 ఆగస్టు వరకు 13 చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. ఈ చలానాలకు మొత్తం రూ.12,100 నగదు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు జనగామ జిల్లా కలెక్టర్ వాహనంపై 23 చలానాలు పడ్డాయి. జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనంపై 2021 ఆగస్టు 30వ తేదీ వరకు 23 చలానాలు పడ్డాయి. ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Also Read:  ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget