అన్వేషించండి

Telangana Govt: తెలంగాణలో కొత్త రకం రేషన్ కార్డుల పంపిణీ! ఎన్నికల కోడ్ ముగియగానే అమలు?

Ration Cards Issue: రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల స్వరూపం మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

New Ration Cards: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల (Ration Cards) స్వరూపం మార్చేందుకు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రేషన్‌/ఆహార భద్రత కార్డుల (Food Security Cards) భౌతిక స్వరూపం మార్చాలనే యోచనలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. పాత కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆగిందని, కోడ్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన కసరత్తు మొదలవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కార్డు ఎలా ఉండాలి? దాని స్వరూపం ఏంటనే విషయంపై ఎన్నికల కోడ్‌ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది.

తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 ఆహార భద్రత కార్డులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఓ చిన్న పుస్తకంలా ఉండేది. అందులో కుటుంబ యజమాని ఫొటో, కుటుంబ సభ్యుల పేర్లు, వయసు వివరాలు ఉండేవి. ఆ తర్వాత రైతుబంధు పాస్‌బుక్‌ సైజ్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్‌కార్డులు జారీ చేసింది. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్‌ ఫొటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. వెనుకవైపు చిరునామా, ఇతర వివరాలు పొందు పరిచేవారు. 

ఆ తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఇవి ఒక పేజీ మాత్రమే ఉండేవి. ఇందులో ఒక వైపు మాత్రమే కార్డుదారుడు, కుటుంబ సభ్యులు, రేషన్‌ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉంటాయి. అలాగే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫొటో ఉండదు. ఇప్పుడు కొత్త కార్డులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. కార్డు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికల కోడ్‌ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలిసింది.

ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన ప్రభుత్వం
ఆరోగ్యశ్రీ కార్డు చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు చికిత్స చేసుకునే సౌకర్యం ఉండగా దానిని.. ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కొత్త ప్రయోజనాలను వివరిస్తూ పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చిన ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్రం తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ సిరీస్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్పు చేస్తూ మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌లో మార్పు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.

జిల్లా పేర్లు మార్చేందుకు నిర్ణయం
తెలంగాణలో రెండు జిల్లాల పేర్లు మార్చనున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రాయంగా తెలిపారు. జనగామ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు, ఉమ్మడి వరంగల్‌లోని ఏదైనా జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టే యోచనలో ఉన్నట్లు సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గత ప్రభుత్వం భూపాల పల్లి జిల్లాకు ప్రొఫెసర్ జయశంకర్ అని, గద్వాలకు శక్తిపీఠం జోగులాంబ అని, భూవనగిరి జిల్లాకు యాదాద్రి, కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి, ఆసిఫాబాద్ జిల్లాకు కొమురం భీం, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న అంటూ చారిత్రక నేపథ్యం, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
US Israel Strikes On Iran: దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
Embed widget