అన్వేషించండి

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

Telangana News: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో భూమి లేని పేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. తొలి విడతగా రూ.6 వేలు ఈ నెల 28న ఇస్తామని తెలిపింది.

Telangana Cabinet Key Decisions: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. భూమి లేని పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారు 5 గంటలకు పైగా కేబినెట్ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28న ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఏడాదిలో 2 విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా రూ.6 వేల మొత్తాన్ని ఆ రోజున లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి రూ.12,000 వేలు చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్నారు. అలాగే, వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రైతులకు, వ్యవసాయం కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా 36 లక్షల మందికి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్న బియ్యం అందజేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు చెప్పారు.

ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణ

ఈ - ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని సర్కారు పేర్కొంది. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ - కార్ రేస్ వ్యవహారంలో చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేటీఆర్‌‌ను విచారించేందుకు అనుమతి ఇప్పటికే లభించిందని, గవర్నర్ అనుమతి ఇస్తూ జారీ చేసిన దస్త్రాన్ని సోమవారం రాత్రి, లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీకి పంపిస్తారని అన్నారు. చట్ట ప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

'గవర్నర్ అనుమతిపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఈ వ్యవహారంలో జరిగిన దోపిడీపై కేబినెట్‌లో చర్చించాం. కేటీఆర్ అరెస్టుపై నేనేమీ చెప్పలేను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు బాంబు తుస్సుమందని వ్యాఖ్యానించారు. అది తుస్సుమనేదైతే.. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారు.?. అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లా కాకుండా గూండాల్లా ప్రవర్తించారు. మాట్లాడడానికి అంశం లేనందుకే ప్లకార్డులు, నినాదాలతో సభకు ఆటంకం కలిగించారు. ఈ సమావేశాల్లో ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెడతాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు. ప్రధానమైన అవినీతిని ప్రజల ముందు ఉంచుతున్నాం.' అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

Also Read: KTR Arrest News: కేటీఆర్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది - పొంగులేటి వ్యాఖ్యలు - హింట్ ఇచ్చినట్లేనా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget