అన్వేషించండి

Telangana Doctors: నకిలీ డాక్టర్ల చికిత్సకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఫాలో కావాలంటున్న తెలంగాణ వైద్యులు

Color Coded Boards: రాష్ట్రంలో నకిలీ, అర్హత లేని వైద్యులను గుర్తించేందుకు కర్ణాటక తరహాలో నీలం, ఆకు పచ్చ బోర్డుల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ వైద్యులు కోరుతున్నారు.  

Color Coded Boards In Telangana: తెలంగాణలో నకిలీ ప్రైవేటు డాక్టర్ల (Fake Doctors) గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన వైద్యులు కోరుతున్నారు. నకిలీ, అర్హత లేని వైద్యులను గుర్తించేందుకు కర్ణాటక (Karnataka Model) తరహా విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కర్ణాటకలో ఎంబీబీఎస్‌, స్పెషలిస్ట్‌ ప్రైవేట్‌ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు నీలం రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. 

కర్ణాటక ప్రభుత్వం కలర్ కోడ్
పెరుగుతున్న రోగాలకు తోడు కర్ణాటకలో ప్రైవేటు ఆస్పత్రులు విపరీతంగా పెరిగిపోయాయి. రోగులు అసలైన వైద్యులు, ఆస్పత్రులను గుర్తించలేక డబ్బుతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి చెక్ పెట్టేందుకు కర్ణాటక సర్కార్ ఆస్పత్రుల ముందు కలర్ కోడెడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. నిజమైన వైద్యులను గుర్తించేందుకు, ఏ తరహా వైద్యుడో తెలుసుకునేలా బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, స్పెషలిస్ట్‌ ప్రైవేట్‌ డాక్టర్లు నీలం రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ప్రజలకు కన్పించేలా బోర్డులు 
కర్ణాటక ప్రైవేట్‌ మెడికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ప్రతి వైద్యుడు తాము నిర్వహిస్తున్న ఆస్పత్రుల ముందు కలర్‌ కోడెడ్‌ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డుపై రిజిస్ట్రేషన్  నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, సంబంధిత వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు అందిస్తున్న సేవలు ప్రదర్శించాలి. ఈ సమాచారం అంతా ప్రజలకు కనిపించేలా ఆసుపత్రి ఆవరణలో బహిరంగ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులు గుర్తించేంచి మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు కలర్ కోడెడ్‌ బోర్డులు పెట్టని ప్రైవేట్‌ ఆసుపత్రులపై చర్యలు కూడా చేపట్టనుంది. ఈ మేరకు అక్కడి ఆస్పత్రులకు దీని గురించి హెచ్చరికలు సైతం జారీ చేసింది.

నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టొచ్చు
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక గుర్తింపు పొందిన, స్పెషలిస్ట్ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది కాస్తా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆస్పత్రుల ముందు నీలం, ఆకుపచ్చ రంగు బోర్డులు ఉండడం వల్ల రోగులు మోసపోరని, నకిలీ డాక్టర్లను సులభంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సైతం జరిమానాలు విధించడానికి సిద్ధమవడంతో నకిలీ వైద్యుల్లో భయం కలుగుతుందని, తద్వారా ప్రజల ప్రాణాలు సైతం కాపాడవచ్చని చెబుతున్నారు.

తెలంగాణలోను అమలు చేయాలి
కర్ణాటక తరహాలోనే నీలం, ఆకుపచ్చ రంగుల బోర్డుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్‌ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డాక్లర్లమని చెప్పుకునే నకిలీ వైద్యులకు ఇలాంటి నిబంధన చెక్‌ పెడుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ సైతం దీనిపై సానుకూలంగా స్పందించారు. నకిలీ వైద్యుల నుంచి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని శ్రీనివాస్ చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget