అన్వేషించండి

Telangana Bjp: ఉద్యోగుల బదిలీలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం... గవర్నర్ కు బీజేపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు

రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. గవర్నర్ తమిళిసైతో బీజేపీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. 317 జీవోను సవరించాలని వినతి పత్రం అందించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కలిసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరుగుతోందని ఫిర్యాదు చేశారు. తక్షణమే బదిలీల ప్రక్రియను నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ బృందంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. Telangana Bjp: ఉద్యోగుల బదిలీలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం... గవర్నర్ కు బీజేపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు

Also Read: హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ రెడీ .. న్యూ ఇయర్ రోజునే అందుబాటులోకి !

గవర్నర్ ను కలిసిన బీజేపీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను తక్షణమే నిలిపేయడంతోపాటు 317 జీవోను సవరించాలని వినతి పత్రం అందించారు.  తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నినాదం నీళ్లు-నిధులు-నియమాకాలకు విరుద్ధంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ ఉత్తర్వులు 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయన్నారు. 317 జీవో అమలుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర జిల్లాల్లోనే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ జీవో అమలైతే మారుమూల ప్రాంతాల్లో మరో 2, 3 దశాబ్దాలపాటు ఉద్యోగ ఖాళీలు అయ్యే అవకాశమే ఉండదన్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల నిరుద్యోగులకు తీవ్రనష్టమని బీజేపీ ప్రతినిధులు గవర్నర్ కు తెలిపారు. 317 జీవోలో 28వ పేరా రాష్ట్రపతి ఉత్తర్వులను, రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఉందని ఫిర్యాదు చేశారు. 

Also Read: హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం, వంతెనకు అబ్దుల్ కలాం పేరు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించిన తర్వాతే నూతన గైడ్ లైన్స్ రూపొందించి బదిలీలు చేపట్టాలని బీజేపీ నాయకులు కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కేటాయింపులో స్థానికతను  ప్రామాణికంగా తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగానే బీసీ ఉద్యోగులకూ తప్పనిసరిగా ‘ఆప్షన్ ఫార్మెట్’ కాలమ్ ను వర్తింపజేయాలన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి బిశ్వాల్ (పీఆర్సీ) కమిటీ గుర్తించిన 1.92 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 

Also Read: మందుబాబులకు బంపర్ ఆఫర్.. న్యూ ఇయర్ ఈవెంట్లకు వెళ్లేవారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget