అన్వేషించండి

RS Praveen Kumar: కానిస్టేబుల్ జాబ్స్‌కు ఎంపికైనా, వారికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు?- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Telangana Police Jobs 2024: గతంలో నమోదైన చిన్న చిన్న కేసులను సాకుగా చూపించి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా.. జాబ్స్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.

Telangana Police Constable Jobs: తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని కొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులతో పాటు చిన్న చిన్న విషయాలలో కేసులు నమోదయ్యాయని.. కొందరిపై నమోదైన కేసుల్లో నిర్దోషిగా తేలినా కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి చర్యలు తీసుకుంటే, తమ కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని బాధిత అభ్యర్థులు కోరుతున్నారు. ఈ అవకాశం పోతే, తమకు ఏజ్ లిమిట్ దాటిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆ అభ్యర్థులకు అండగా నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
రాష్ట్ర పోలీస్ నియామక మండలి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలు, ఈవెంట్లలో ఉత్తీర్ణత సాధించినా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన సుమారు 1500 మంది అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణలో ఈ బాధిత అభ్యర్థుల కన్నీళ్లు తుడిచే నాధుడే లేడు అంటూ బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (TSLPRB) రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ఏఆర్,ఎస్‌ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కానీ కొందరు అభ్యర్ధులు తమ స్వీయ ధృవీకరణ (Self Attestation) పత్రంలో తమపై నమోదైన సివిల్, క్రిమినల్, బైండోవర్, కరోనా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆ అభ్యర్థులపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన విద్యార్థి ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా,ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికం ఉన్నాయన్నారు. 

నిర్దోషిగా తేలినా జాబ్స్ ఇవ్వడం లేదు
పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థులపై నమోదైన కేసుల్లో కొన్నింటిపై తీర్పు వచ్చి, కోర్టుల్లో నిర్దోషిగా తేలినా జాబ్స్ ఇవ్వడం లేదు. స్పెషల్ బ్రాంచ్ (SB) అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు, కేసుల్లో నిర్దోషిగా తేలిన కోర్టు జడ్జిమెంట్ కాఫీలను స్వయంగా అభ్యర్ధులు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు, 
TSLPRB  అధికారులకు అందించారు. కానీ ఆ అభ్యర్థులకు మిగతా ఎంపికైన అభ్యర్థులలాగ పోలీస్ శిక్షణకు అవకాశం కల్పించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఇంత చులకనభావం ఎందుకు? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 14 న L.B స్టేడియంలో ఎంతో ఆర్భాటంగా అందజేసిన ఎంపిక పత్రాల్లో చాలా మంది అభ్యర్థులకు మొండి 'చేయి' చూపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని, కాంగ్రెస్ సర్కార్ బాధ్యతా రహిత్యమే అంటూ మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.

యూపీఎస్సీ (UPSC) నిర్వహించే ఉద్యోగ నియామకాల్లో స్వీయ ధృవీకరణ పత్రంలో పేర్కొన్న కేసుల్లో స్పెషల్ బ్రాంచ్ (SB), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారుల తుది పరిశీలనలో నిర్దోషిగా తేలితే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఎంపికైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.

కానిస్టేబుల్ గా ఎంపికైన అభ్యర్థులు ట్రైనింగ్ కోసం ఆర్డర్ కాపీలు ఇవ్వాలంటూ సీఎం నివాసం, డీజీపీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అసలు తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? ఆ అభ్యర్థుల మనోవేదనపై రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి స్పెషల్ బ్రాంచ్ (SB) పరిశీలనలో నిర్దోషిగా తేలిన అభ్యర్థులను శిక్షణకు పంపేలా TSLPRB  చైర్మన్ కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget