అన్వేషించండి

Prashant Kishore vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను - ఓడించి తీరుతా - ప్రశాంత్ కిషోర్ శపథం !

PK On Revanth: రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని ప్రశాంత్ కిషోర్ మరోసారి హెచ్చరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మోదీ, రాహుల్ .. రేవంత్ ను కాపాడలేరన్నారు.

Prashant Kishor once again warns Revanth Reddy:   జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  "వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి రేవంత్‌ను ఓడించి తీరుతాను.. రాహుల్ గాంధీ, మోడీ ఎవరూ కాపాడలేరు" అని తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించారు.  బిహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తన జన్ సురాజ్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి రేవంత్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
2023 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన కేబినెట్‌లో బిహార్‌కు చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని, వారిని  అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని..దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.  ఆ సమయంలో ఓ టీవీ చానల్ తో మాట్లాడుతున్న సమయంలో "తెలంగాణ DNA బిహార్ DNA కంటే బెటర్.. బిహార్ వాళ్ల DNAలోనే కూలీ పని ఉంది" అని రేవంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బిహార్ ప్రజలను అవమానించినట్లుగా  ఉన్నాయని  బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.       

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ సీరియస్ గా తీసుకున్నారు.  "రేవంత్ బిహార్ ప్రజలను అవమానిస్తున్నాడు. బిహార్ వాళ్ల DNA తక్కువ అంటే, మీరు మా సహాయం ఎందుకు అడిగారు?" అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తనను మూడుసార్లు సంప్రదించి, ఎన్నికల వ్యూహాలకు సహాయం అడిగారని కూడా  పీకే తెలిపారు. 2025 ఆగస్టులో బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి నిర్వహించిన 'వోటర్ అధికార్ యాత్ర'లో రేవంత్ రెడ్డి పాల్గొనడం ప్రశాంత్ కిషోర్‌కు ఆగ్రహం తెప్పించింది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ 16 రోజుల యాత్రలో రేవంత్ ప్రచారం చేయడం బిహార్ ప్రజల అవమానమని ప్రశాంత్  కిషోర్ అప్పుడే ఖండించారు. "రేవంత్ బిహార్ వాళ్లపై దుర్మార్గ వ్యాఖ్యలు చేస్తాడు. బిహార్ గ్రామాలకు వస్తే, ప్రజలు అతన్ని తరిమికొడతారు" అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ రేవంత్‌ను ఆహ్వానించడం "బిహార్  గౌరవానికి  అవమానం" అని కూడా విమర్శించారు.
 
ప్రశాంత్ కిషోర్ 2025లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీతో పోటీ పడుతున్నారు. ఆత్మగౌరవ నినాదం  ద్వారా బిహార్ ప్రజల్లో తమ పార్టీకి మద్దతు పెంచుకోవాలని, కాంగ్రెస్‌పై  రేవంత్‌తో లింక్ చేసి  విమర్శలు రేకెత్తించాలని వ్యూహమని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి స్పందించలేదు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget