అన్వేషించండి

TS Panchayat Funds : తెలంగాణ సర్కార్ పంచాయతీ నిధుల్ని మళ్లించిందా ? ఎందుకీ రాజకీయ దుమారం ? ప్రభుత్వం ఏమంటోంది ?

తెలంగాణలో పంచాయతీ నిధుల మళ్లింపు వ్యవహారం రాజకీయ వివాదానికి దారి తీస్తోంది. అసుల పంచాయతీ నిధులను ఎవరు దారి మళ్లించారు ? ప్రభుత్వం ఏమంటోంది ?


TS Panchayat Funds :   తెలంగాణలో ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని మళ్లించిందనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు కూడా తెలంగాణ ప్రభుత్వం మళ్లించుకున్నదని సర్పంచులు ఆందోళన చేస్తున్నారు.  ఓ ఉపసర్పంచి ఆత్మహత్య  చేసుకున్నారు.  సర్పంచులు రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నిధులను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆందోళనలు చేస్తోంది. అసలేం జరుగుతోంది. 

15వ ఆర్థిక సంఘం నిధులు మాయమయ్యాయంటున్న సర్పంచ్‌లు ! 
 
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కొద్ది రోజుల కిందట నిధులు విడుదల చేసింది. అన్ని పంచాయతీలకు కలిపి ఈ మొత్తం రూ. ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ నిధులు ఇటీవల తెలంగాణ గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ అయ్యాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయతీల్లోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచ్‌లకు మాత్రమే ఉంటుంది. కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పేరుపై బ్యాంకు ఖాతా తెరిచింది. గ్రామ పంచాయతీ కమిటీ తీర్మానం ఆధారంగా వీరికి ఆ డబ్బు డ్రా చేసే అధికారం ఉంటుంది.  ఇందులో 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలినవి సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలి. 

సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే నిధులు మాయం !

అయితే కేంద్రం ఇలా జమ చేయడం ఆలస్యం అలా నిధులు మాయం అయిపోయాయి. ప్రభుత్వం తీసేసుకున్నదని సర్పంచులు ఆందోళన బాట పట్టారు. గ్రామాల్లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయని... వాటిని చేయాలని అనుకున్నారు. అయితే  వచ్చినవి వచ్చినట్లుగా మాయం కావడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజీనామాలు చేస్తామంటున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నిధులు తిరిగి ఇవ్వకుంటే ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని  సర్పంచ్‌ల సంఘం హచ్చరికలు జారీ చేస్తోంది.  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ అధికారులు.. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు తెలియకుండా, వారి బ్యాంకు ఖాతాల డిజిటల్‌ కీ ఆధారంగా ఈ నిధులను విత్‌ డ్రా చేశారని ఆరోపిస్తున్నారు.  

మళ్లించలేదు - బిల్లులు చెల్లించామంటున్న ప్రభుత్వం 

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సర్పంచ్‌లు. విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తోంది. ప్రభుత్వ ఖాతాల్లోకి నిమళ్లించలేదు కానీ తామే ఖర్చు చేశామని అంగీకరిస్తోంది.  15వ ఆర్థిక సంఘం నిధులను  పీఎఫ్‌ఎంఎస్‌  ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుందని .. అలాగే ఖర్చు చేశారు కానీ..  రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని చెబుతున్నారు.  కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదల చేస్తామన్నారని అందుకే  ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ట్టు వివరించారు.కేంద్రం సైతం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నదని, నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్ల్లో జమ చేయదని ప్రభుత్వం చెబుతోంది.  కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్‌లను విడుదల చేయడానికి ముందు గ్రామ పంచాయతీలు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా నిర్దిష్ట ఖర్చులను రికార్డు చేశాయని చెబుతున్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget