అన్వేషించండి

Nizamabad: ప్రజల కోసం పనిచేసే నాయకులకు మద్దతివ్వండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రజల కోసం పని చేసే నాయకులకు మద్దతివ్వండని ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ప్రజలకు రిక్వస్ట్ చేశారు. బీజేపీ నాయకుల మాయ మాటలతో అభివృద్ధి జరగదన్నారు.

కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ మండల కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి 18 అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపనలు చేశారు. దాదాపు 30 కోట్ల రూపాయలతో భీమ్ గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని, దీనికి సీఎం కేసీఆర్ గారి కృషి, పట్టుదలే కారణమన్నారు. రాష్ట్రం కోసం ఎంత కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంతే చిత్తశుద్దితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం మాయ మాటలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పని చేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భీమ్ గల్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, బాల్కొండను బంగారు బాల్కొండగా మార్చే బాధ్యత మాదని ప్రకటించారు. భీంగల్ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని, భీంగల్ పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బిజెపి ,కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.  భీమ్ గల్ ను మున్సిపాలిటిగా మార్చాలని ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ ను కోరారని, భీమ్ గల్ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల నిధులు విడుదల చేసేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

Also Read:  గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 42 మంది విద్యార్థులకు పాజిటివ్...

Also Read: పంచాయతీ ఖాతాలను ప్రభుత్వం ఎందుకు ఖాళీ చేసింది ? సొంత క్యాడర్‌ను వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎందుకు ఇబ్బంది పెడుతోంది ?

Also Read: డిసెంబర్ 13 నుంచి కృష్ణా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ..అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం !

Also Read: చెంబులో తల పెట్టిన మూగజీవి... పిల్లి అనుకుని సాయం చేయబోయిన వైఎస్సార్టీపీ నేత... పులిపిల్ల అని తెలిసి పరుగో పరుగు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Telangana Indiramma Family Life Insurance Scheme : తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
తెలంగాణ ప్రజలందరికీ టెర్మ్‌ ఇన్సూరెన్స్‌! రేవంత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తారా !
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget