అన్వేషించండి

వంట గదిలోనే స్నానాలు, బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం- వెలుగులోకి తెచ్చిన విద్యార్థులు!

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో ఓ వైపు వంటలు చేస్తున్న సిబ్బంది అక్కడే స్నానాలు కూడా కానిచ్చేస్తున్నారు. అన్నం తినేందుకు వచ్చిన విద్యార్థులు ఆ సీన్స్‌ను చూసి షాక్ అయ్యారు.

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. ఏదో వివాదంతో నిత్యం వార్తల్లోకి ఉండటం బాసర ట్రిపుల్ ఐటీకీ కామన్ అయిపోయింది. తాజాగా ట్రిపుల్ ఐటీ మెస్‌లోని సిబ్బంది అక్కడే స్నానం చేస్తున్న తీరును విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. ఓవైపు వంట చేస్తుండగా మరోవైపు సిబ్బంది స్నానం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను విద్యార్థులు సెల్‌ఫోన్‌లో షూట్ చేశారు. వంట పక్కనే ఇంత నిర్లక్ష్యంగా స్నానాలు చేస్తుండటాన్ని విద్యార్థులు తప్పుబట్టారు. కనీస శుభ్రత పాటించటం లేదని వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిన్నటికి నిన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా సిబ్బంది మెస్‌లోనే ఇలా స్నానాలు చేయటంపై విద్యార్ఖులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పైకి చెబుతునారే తప్ప లోపల మరోలా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు.

అప్పట్లో వరుసగా మూడ్రోజులు అన్నంలో సాలె పురుగులు..

గతంలోనూ బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో వరుసగా మూడు రోజులపాటు అన్నంలో సాలె పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా రోడ్డెక్కారు. ఈ విషయంపై విచారణ కోసం భైంసా ఆర్డీఓ లోకేశ్వర్రావు కూడా మెస్ సందర్శించారు. సాలె పురుగు వచ్చింది నిజమేనని.. దాన్ని ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. అయినప్పటికీ కనీస వసతులు కల్పించడంలో అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో దాదాపు 8 వేల మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 10 రోజులపాటు వర్షంలో తడుస్తూనే.. ఆందోళన చేశారు. వీరి ఆందోళనతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగంలోకి దిగారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత వైస్ ఛాన్స్‌లర్‌తో సమావేశం కూడా అయ్యారు.

గతంలోని సమస్యలపై కేటీఆర్ స్పందన..

విశ్వవిద్యాలయంలో మౌలిక సమస్యలపై చర్చించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. అయితే అదే విషయాన్ని తేజగౌడ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. కనీస సదుపాయల కోసం దాదాపు 8 వేల మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కారని వివరించారు. స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వరకు తీసుకెళ్లాతమంటూ చెప్పారు. ఇలా సీఎం వరకు విషయం వెళ్లినా మళ్లీ ఇలాంటి సమస్యలే రావడంపై విద్యార్ఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు రిపీట్ అవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్నం వండే చోట, తినే చోటే స్నానాలు చేయడం ఎలా ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget