అన్వేషించండి

Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to Visit Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొఠారి గ్రామంలో పూర్తయిన ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీఎం రేవంత్ రెడ్డి రూ.112 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం గృహప్రవేశాలు, రెండో విడత ప్రారంభోత్సవం ఉంటుంది.
  • 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, పట్టణ అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.
  • సీఎం పర్యటన కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు, భారీ పోలీసు బందోబస్తు.

ఆసిఫాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చింతలమానేపల్లి మండలంలోని కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.56.55 కోట్లు. రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

నారాయణపేటలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలివిడతలో ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయంతో 3,68,540 ఇళ్లు కేటాయించగా, 1,09,682 ఇళ్లు పూర్తయ్యాయి. వీటి గృహప్రవేశాలు, రెండో విడత ఇళ్ల ప్రకటన కోసం రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 5:45 గంటలకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలోని గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కాగజ్‌నగర్ సభ నుండి రెండో విడత గృహ నిర్మాణ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసం నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు రానున్నారు. 

అదే విధంగా చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఉపకేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. 

Also Read: KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్

జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, పునరుత్పాదక ఇంధన వినియోగ ప్రోత్సాహం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి జూపల్లి  తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా  ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు సభా స్థలం, పార్కింగ్ ప్రదేశాలు, వీఐపీ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, హెలిప్యాడ్ ప్రాంతం, ట్రాఫిక్ మార్గాలు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా భద్రతా నిర్వహణ కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బందోబస్తులో ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు/ఆర్‌ఐలు, 157 మంది ఎస్‌ఐలు/ ఆర్‌ఎస్‌ఐలు/ డబ్ల్యూఎస్‌ఐలు, 200 మంది ఏఎస్‌ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 829 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 43 మంది మహిళా పోలీసు సిబ్బంది, 328 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొనున్నారు. 

Also Read: Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు

అదనంగా 9 ప్రత్యేక పార్టీలు, 2 రోప్ పార్టీలు, 28 యాక్సెస్ కంట్రోల్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలను మోహరించినట్లు తెలిపారు. మొత్తం 1,825 మంది పోలీసు అధికారులు, సిబ్బంది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి, ట్రాఫిక్, భద్రతా నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు.

Frequently Asked Questions

తెలంగాణ ముఖ్యమంత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారా?

అవును, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ముఖ్యమంత్రి ఎన్ని కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు?

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో విద్యుత్ ఉపకేంద్రాలు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పట్టణాభివృద్ధి పనులు ఉన్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ఏమి ప్రకటించనున్నారు?

ముఖ్యమంత్రి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. కొఠారి గ్రామంలో గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు?

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 1,825 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బృందాలు భద్రతా నిర్వహణలో పాల్గొంటున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Breaking News: నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
నేడు సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం- అర్థరాత్రి వరకు ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget