అన్వేషించండి

Nizamabad News: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలి. అవకతవకలకు తావులేకుండా చర్యలు. 16వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు నుంచి ఒంటిగంట వరకు పరీక్ష

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు. 16 వ తేదీన ఉదయం 10 . 30 గంటల నుంచి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే పరీక్షకు జిల్లాలో 12,858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరి కోసం జిల్లాలో 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
 
టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఇప్పటికే 70 శాతం మంది హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు జిల్లా కలెక్టర్. హాల్ టికెట్‌లో ఎవరికైనా ఫోటో ప్రింట్ కాని పక్షంలో మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు తెల్ల కాగితంపై అతికించి గజిటెడ్ అధికారి అటెస్టేషన్‌తో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐ.డీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తేవాలని సూచించారు. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలన్నారు. సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఎగ్జామ్ ప్యాడ్‌కు అనుమతి లేనందున వాటిని వెంట తెచ్చుకోకూడదని అన్నారు.
 
ఈసారి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎలక్రానిక్ పరికరాల గుర్తింపు కోసం ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్‌లు ఏర్పాటు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని, బయోమెట్రిక్ విధానం ఉన్నందున చేతులకు గోరింటాకు, ఇతరాత్రా పెయింట్ లు ఉండకుండా చూసుకోవాలని హితవు పలికారు. జిల్లాకు సంబంధించి 24 మంది దివ్యాంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులతో పరీక్ష రాసేందుకు అనుమతి కోరారని, అలాంటివారు ఇంటర్మీడియట్ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. తమ వెంట వైకల్యం ధృవీకరించే సర్టిఫికెట్ తేవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 
 
ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 08462 - 220183 నెంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని, అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కాల్ సెంటర్ 040 - 22445566 నెంబర్‌కు కూడా నేరుగా ఫోన్ చేయవచ్చని అన్నారు. హాల్ టికెట్‌లో పొందుపర్చిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని కలెక్టర్ హితవు పలికారు.
 
ఈసారి ప్రిలిమ్స్ పరీక్షకు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ తప్పనిసరి చేసినందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం రెండు గంటలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి 60 మందికి ఒక బయో మెట్రిక్ యూనిట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం 10 .15 గంటల వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతిస్తారని అనంతరం గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుంచే వచ్చే అభ్యర్థులంతా ఉదయం 8 .00 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 
 
అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కలెక్టర్. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్ డెస్క్ టేబుళ్లు, తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయిలెట్ వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ నియమిస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్‌లు మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
 
అన్ని కేంద్రాల వద్ద మహిళా పోలీసు సిబ్బంది సైతం ఉంటారని, అభ్యర్థుల కోసం బస్టాండ్లలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ చొప్పున నియమిస్తూ వారికి పరీక్షల నిర్వహణ, నిబంధనలపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలోనూ సి.సి కెమెరాలు ఉండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ జరిపిస్తామన్నారు.
 
ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, 7 కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపశ్రుతులు, అపవాదులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అభ్యర్థులు నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget