అన్వేషించండి

Mulugu News : నీటి గుంతలో పడి 2వ తరగతి విద్యార్థి మృతి, స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు!

Mulugu News : ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లిన 2వ తరగతి చిన్నారి నీటి గుంతలో పడి చనిపోయాడు.

Mulugu News : కొడుకును స్కూలుకు పంపిన తల్లిదండ్రులకు మధ్యాహ్నంలోపే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిండనే చేదువార్త కడుపుకోత మిగిల్చింది. స్కూల్ టీచర్ల నిర్లక్ష్యంతో పసిప్రాణం పోయింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్టించుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి స్కూల్ నుంచి బయటకు వెళ్లి సమీపంలోని నీటిగుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో శనివారం జరిగింది. బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్వాయి గ్రామానికి చెందిన అల్లం స్వాతి, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసే ఆ దంపతుల చిన్న కుమారుడు రిషిత్(7) చల్వాయిలోని హాస్టల్ గడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో 2వతరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన రిషిత్ పాఠశాలకు వెళ్లి బుక్స్ పెట్టి మరో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. 

టాయిలెట్స్ సదుపాయంలేకే

పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నా కూడా అవి నిరుపయోగంగానే ఉన్నాయి. చిన్నారులు ప్రతీరోజు టాయిలెట్స్ కు స్కూల్ నుంచి బయటకే వెళ్తారు. ఈ క్రమంలో బహిర్భూమికి స్నేహితునితో కలిసి వెళ్లిన రిషిత్ నీళ్లలో పడిపోయి ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు మరణించిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు  మృతదేహంతో స్కూల్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తమ కొడుకు చావుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవిందరావుపేట ఎంఈవో దివాకర్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని చెప్పడంతో అంతిమయాత్రకు తీసుకెళ్లారు. 

Mulugu News : నీటి గుంతలో పడి 2వ తరగతి విద్యార్థి మృతి, స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు!

ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం? 

చల్వాయి ప్రాథమిక పాఠశాలలో బాలుడి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 23 ది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా పట్టింపులేకుండా వ్యవహరించారన్నారు. స్కూల్ లో ఉన్న టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయని, విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిందేనని ఆరోపిస్తున్నారు. స్కూల్ నిర్వహణ సక్రమంగా లేకనే బాలుడి మృతిచెందాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!

 వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడు కొట్టడంతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పూడురు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు సాత్విక్ ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. టీచర్ దాడిలో సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తనను స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే సాత్విక్ ప్రాణాలు విడిచాడు. కేశవరెడ్డి స్కూల్ టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల తన కొడుకు సాత్విక్ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు చెన్గోమల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సాత్విక్ కు బెడ్ పై నుండి కింద పడటం వల్లే గాయాలు అయ్యాయని పాఠశాల యాజమాన్యం అంటోంది. విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాత్విక్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో విచారణ చేపట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
Revanth Reddy: ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!
ఫుడ్ కల్తీపై రేవంత్ సీరియస్- ఈగల్‌, హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటుకు రెడీ! కేసీఆర్‌ను హౌస్ అరెస్టు చేశారని విమర్శ!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Updates: హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
హర్మూజ్ జలసంధిపై వెనక్కి తగ్గుతున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ముందు అమెరికా ఆటలు సాగలేదా ?
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
India Census 2027: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్త జనగణన.. ఏపీ, తెలంగాణలో ప్రక్రియ షెడ్యూల్ ఇదే
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Harudu Movie Release Date: పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
పవన్ 'ఓజీ'తో మళ్ళీ వెలుగులోకి... 'హరుడు'తో సోలో హీరోగా!
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Embed widget