అన్వేషించండి

Mulugu News : నీటి గుంతలో పడి 2వ తరగతి విద్యార్థి మృతి, స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు!

Mulugu News : ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లిన 2వ తరగతి చిన్నారి నీటి గుంతలో పడి చనిపోయాడు.

Mulugu News : కొడుకును స్కూలుకు పంపిన తల్లిదండ్రులకు మధ్యాహ్నంలోపే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిండనే చేదువార్త కడుపుకోత మిగిల్చింది. స్కూల్ టీచర్ల నిర్లక్ష్యంతో పసిప్రాణం పోయింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థిని పట్టించుకోకపోవడంతో మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి స్కూల్ నుంచి బయటకు వెళ్లి సమీపంలోని నీటిగుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో శనివారం జరిగింది. బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్వాయి గ్రామానికి చెందిన అల్లం స్వాతి, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసే ఆ దంపతుల చిన్న కుమారుడు రిషిత్(7) చల్వాయిలోని హాస్టల్ గడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో 2వతరగతి చదువుతున్నాడు. రోజూలాగే శనివారం స్కూల్ కు వెళ్లిన రిషిత్ పాఠశాలకు వెళ్లి బుక్స్ పెట్టి మరో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. 

టాయిలెట్స్ సదుపాయంలేకే

పాఠశాలలో టాయిలెట్స్ ఉన్నా కూడా అవి నిరుపయోగంగానే ఉన్నాయి. చిన్నారులు ప్రతీరోజు టాయిలెట్స్ కు స్కూల్ నుంచి బయటకే వెళ్తారు. ఈ క్రమంలో బహిర్భూమికి స్నేహితునితో కలిసి వెళ్లిన రిషిత్ నీళ్లలో పడిపోయి ఊపిరాడక మృతిచెందాడు. కొడుకు మరణించిన వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు  మృతదేహంతో స్కూల్ కు వచ్చి ఆందోళన చేపట్టారు. పాఠశాలలో 23 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తమ కొడుకు చావుకు ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవిందరావుపేట ఎంఈవో దివాకర్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాలుడి తల్లిదండ్రులకు నచ్చజెప్పి న్యాయం చేస్తామని చెప్పడంతో అంతిమయాత్రకు తీసుకెళ్లారు. 

Mulugu News : నీటి గుంతలో పడి 2వ తరగతి విద్యార్థి మృతి, స్కూల్ లో టాయిలెట్స్ లేక బయటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు!

ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే బాలుడి మృతికి కారణం? 

చల్వాయి ప్రాథమిక పాఠశాలలో బాలుడి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని బాలుడి తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 23 ది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నా పట్టింపులేకుండా వ్యవహరించారన్నారు. స్కూల్ లో ఉన్న టాయిలెట్స్ నిరుపయోగంగా ఉన్నాయని, విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిందేనని ఆరోపిస్తున్నారు. స్కూల్ నిర్వహణ సక్రమంగా లేకనే బాలుడి మృతిచెందాడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి!

 వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడు కొట్టడంతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందాడు. పూడురు మండలం చిలాపూర్ సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో సాత్విక్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు సాత్విక్ ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు. టీచర్ దాడిలో సాత్విక్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు తనను స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామంలోని ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూనే సాత్విక్ ప్రాణాలు విడిచాడు. కేశవరెడ్డి స్కూల్ టీచర్ తీవ్రంగా కొట్టడం వల్ల తన కొడుకు సాత్విక్ మృతి చెందాడంటూ తల్లిదండ్రులు చెన్గోమల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సాత్విక్ కు బెడ్ పై నుండి కింద పడటం వల్లే గాయాలు అయ్యాయని పాఠశాల యాజమాన్యం అంటోంది. విద్యార్థి సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాత్విక్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో విచారణ చేపట్టారు.

టాప్ హెడ్ లైన్స్

KTR News: కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
కన్నెపల్లి పంప్‌హౌస్‌ పర్యటనకు కేటీఆర్‌.. లారీలు అడ్డుపెట్టిన పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Embed widget