అన్వేషించండి

Bandi Sanjay : సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో సవాల్, ఈసారి సీఎం పదవిపై!

Bandi Sanjay : సీఎం కేసీఆర్ దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయాలని బండి సంజయ్ సవాల్ చేశారు.

Bandi Sanjay : మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... దేశంలోని దళితులందరికీ నరేంద్రమోదీ ఆత్మబంధువు అన్నారు. అంబేద్కర్ భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని పార్లమెంటు సాక్షిగా చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్ దళిత ద్రోహిగా మారారని విమర్శించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. ప్రధాని మోదీ దళితుల గౌరవాన్ని పెంచేందుకు, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు ఎన్నో స్కీంలను తీసుకొచ్చారన్నారు. ఇప్పటిదాకా బ్యాంక్ మెట్లు ఎక్కని దాదాపు 3 కోట్ల మంది దళితులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి నేరుగా ఆ నగదు లబ్దిని వారి ఖాతాల్లోనే జమ అయ్యేలా చేశారని బండి సంజయ్ అన్నారు. దళితులు ఉద్యోగాలు అడిగేవాళ్లు కాకూడదు, లైన్లో నిలబడే వాళ్లు కాకూడదు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ప్రధాని మోదీ అన్నారన్నారు. అర్హులైన దళితులకు ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.5 కోట్ల వరకు లోన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 

మునుగోడు యువతకు కోట్ల రూపాయల లోన్లు
 
"మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే స్థానిక యువకులకు కోట్ల రూపాయల లోన్లు ఇప్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను దారుణంగా అవమానించింది. దళితుల హక్కుల కోసం పార్లమెంట్ లో ప్రశ్నిస్తే నెహ్రూ కుదరదన్నారు. రాజీనామా చేస్తానని అంబేడ్కర్ హెచ్చరించిండు. అయినా రాజీనామా చేస్తే చేసుకోపో... అని నెహ్రూ అంటే.. తక్షణమే రాజీనామా చేసి బాబాసాహెబ్ ఉప ఎన్నికల్లోకి వెళితే ఎవరో అనామకుడిని నిలబెట్టి ఎన్నో కుట్రలు, కుతంత్రలు చేసి అంబేడ్కర్ ను ఓడించిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ దే.  బతికున్నప్పుడు పార్లమెంట్ లో అవమానించారు. ఎన్నికల్లో ఓడించి అవమానించారు. ఆఖరికి చనిపోయిన తరువాత కూడా అంబేడ్కర్ మృతదేహాన్ని ఢిల్లీలో పెడితే అక్కడ స్ర్మృతి స్థలం కట్టాల్సి  వస్తుందని ఆయన భౌతిక కాయాన్ని ముంబయికి పంపించి దారుణంగా అవమానించారు. నరేంద్రమోదీ అంబేడ్కర్ ను దైవంతో సమానంగా చూస్తున్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి అంబేడ్కర్ జీవితంతో అనుబంధం ఉన్న 5 స్థలాలను పంచ తీర్థాలుగా అభివృద్ధి చేశారు. ఆయన జ్ఞాపకాలు వందల ఏళ్ల వరకు భవిష్యత్ తరాలకు గుర్తుండాలనే మోదీ ఈ గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు." - బండి సంజయ్ 

దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైంది? 

అంబేడ్కర్ పుట్టిన ఊరు మధ్యప్రదేశ్ లోని ‘‘మావు’’ను గొప్ప స్మారక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం మార్చిందని బండి సంజయ్ అన్నారు. అంబేడ్కర్ లండన్ లో చదువుకునేటప్పుడు ఉన్న ఇంటిని వందల కోట్లు ఖర్చు పెట్టి మ్యూజియంగా మార్చారని గుర్తుచేశారు. నాగ్ పూర్ లోని అంబేడ్కర్ దీక్షా స్థల్ ను గొప్పగా తీర్చిదిద్దారన్నారు. ముంబయిలో అంబేడ్కర్ ఘాట్ ను గొప్ప స్ర్మృతి స్థల్ గా తీర్చిదిద్దారని తెలిపారు. దిల్లీలో అతిపెద్ద అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు.  ప్రధాని మోదీ ఈ ఐదు పంచ్ తీర్థాలను దివ్య క్షేత్రలుగా రూపొందించి భావితరాలకు ఆదర్శంగా నిలిపారన్నారు.  తెలంగాణలో  కేసీఆర్ అడుగడుగునా బాబాసాహెబ్ ను అవమానిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ కోరారన్నారు.  ఎందుకంటే దళితుడి పేరును పదేపదే ఉచ్చరించడం ఇష్టంలేక కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తానంటున్నారని విమర్శించారు.  అన్నింటికి మించి సీఎంఓలో దళిత అధికారులను దగ్గరకు కూడా రానీయ్యలేదన్నారు. గొప్ప ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీరని అవమానం చేశారని బండి సంజయ్ ఆరోపించారు.  కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చి కారణాలు చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఆరోపించారు. దళితులకు మూడెకరాలు.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల దారి మళ్లింపు, ఎస్సీ కార్పొరేషన్ కు నిధులివ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ మొదటి కేబినెట్ లో ఎంతమంది దళితులకు అవకాశమిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.  కేసీఆర్ దమ్ముంటే దళితుడిని సీఎంగా చేయాలన్నారు. కొత్త సెక్రటేరియట్ లో కొత్త ఛైర్ లో దళితుడిని సీఎంగా కూర్చోబెట్టాలని సవాల్ చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Warangal Airport: జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget