Seethakka Legal Notices: కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు - క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక -అసలేమయిందంటే?
Minister Seethakka: మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీతక్క హెచ్చరించారు.

Minister Seethakka sends legal notices to CM KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఆ పోస్టులను 48 గంటల్లోగా తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ , క్రిమినల్ చర్యలు తప్పవని మంత్రి తన లీగల్ నోటీసులో స్పష్టం చేశారు.
అసలు ఈ వివాదానికి కారణం బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ చేసిన ఆరోపణలు. అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో దాదాపు రూ. 30 కోట్ల మేర కుంభకోణం జరిగిందని క్రిషాంక్ ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో రూ. 7 వేలకు లభించే ఫోన్లను, ప్రభుత్వం రూ. 14 వేలకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిందని, ఇది మంత్రి సీతక్క కనుసన్నల్లోనే జరిగిందని ఆయన విమర్శించారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు, ధరల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు.
#BRS, #KCR కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
— AIR News Hyderabad (@airnews_hyd) April 13, 2026
⚖️ అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆరోపణలను ఖండిస్తూ మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు.
#Seethakka #KCR #BRS #TelanganaPolitics #LegalNotice #Anganwadi #PoliticalNews pic.twitter.com/bg7p17ACds
మంత్రి సీతక్క ఈ ఆరోపణలను అసంబద్ధమైనవిగా కొట్టిపారేశారు. అసలు మొత్తం టెండర్ విలువే రూ. 44 కోట్లు అయితే, అందులో రూ. 30 కోట్ల అవినీతి ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా పారదర్శకంగా జరిగిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చారని వివరించారు. ఈ ప్రక్రియతో తనకేమీ సంబంధం లేదని, కేవలం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకే బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని నోటీసులో పేర్కొన్నారు.
30కోట్ల రూపాయలు ఏడీకి పోయినయ్ అని మేం అడగడం నేరమా.
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) April 13, 2026
మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క, కేసీఆర్ గారికి నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ ఫోన్ల స్కాం చేశాడని మాకు సమాచారముంది.. అందుకే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి
మరోసారి… pic.twitter.com/u4rb4DpsiW
మంత్రి లీగల్ నోటీసు పంపిన తర్వాత బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ తనదైన శైలిలో స్పందించారు. తాము పంపిన ఆధారాలు చూసి భయపడి లీగల్ నోటీసుల వెనక దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము చేసిన ఆరోపణలు వాస్తవమని, కోర్టులోనే అన్ని ఆధారాలు బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని, ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ముదిరి కోర్టు మెట్లెక్కేలా కనిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ తన ఆరోపణలను నిరూపించలేకపోతే, ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు, కోర్టు విచారణలో నిజంగానే లోపాలు జరిగాయని తేలితే సీతక్క రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా, ఒక సీనియర్ మంత్రి నేరుగా విపక్ష అధినేతకే నోటీసులు పంపడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ట్రెండింగ్ వార్తలు






















