By: ABP Desam | Updated at : 03 Dec 2022 09:46 PM (IST)
Edited By: jyothi
సైబర్ నేరగాళ్ల చేతిలో చదువుకున్న వాళ్లు మోసపోవడం బాధాకరమం: మంత్రి కేటీఆర్
Minister KTR: ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ఐటీ ఉద్యోగులు సైబర్ నేరాలకు గురవడం నిజంగా బాధాకరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. అవగాహన లోపం వల్లే సైబర్ నేరహాళ్ల చేతిలో మోసపోతున్నారని తెలిపారు. సైబరాబాద్ లో తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు మహమూద్ అలీ ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు, వేగంగా దర్యాప్తు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. మైక్రో సాఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, సియంట్ సంస్థల సహకారంతో పోలీసులు ఏర్పాటు చేసిన ఈ సెంటర్ దేశంలోనే మొట్ట మొదటిది కావడం గమనార్హం.
Minister @KTRTRS today inaugurated Telangana State Police Centre of Excellence for Cyber Safety at @cyberabadpolice Commissionerate in the presence of Home Minister @mahmoodalitrs. The IT Minister congratulated @TelanganaCOPs and organizations instrumental behind the initiative. pic.twitter.com/5J2dCRssu0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 3, 2022
అయితే ప్రస్తుత కాలంలో మొత్తం ఇంటర్నెట్ తో సాగుతుందని మంత్రి కేటీర్ అన్నారు. ప్రతి వస్తువు వైఫైతో పని చేస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో సైబర్ భద్రత చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పుకొచ్చారు. అలాగే సైబర్ నేరాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ విషయం ప్రజల్లోకి ఇంకా వెళ్లట్లేదని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. నేరాలను అరికట్టడానికి కేవలం పోలీసులే కాకుండా.. ఇతర కంపెనీలు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పుకొచ్చారు. నేరాల బారిన పడుతున్న వారిలో చదువుకున్న వారు, ఐటీ ఉద్యోగులు ఉండడం బాధాకరం అని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలను అమలు చేస్తామన్నారు.
Minister @KTRTRS speaking at inauguration of Telangana State Police Center of Excellence for Cyber Safety. https://t.co/MJTEpu9sWD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 3, 2022
మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితుల జాబితా రూపొందించాలని.. ఇందుకోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించి అందులో నిందితుల జాబితా ఉంచాలని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే మహిళలు, బాలికల సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలయినంత వరకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా చూడాలని.. అమ్మాయిలు కూడా ఏదైనా సమస్య వచ్చినట్లు, ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు, షీ టీంలకు ఫోన్ చేయాలని సూచించారు.
TSLPRB: ఆ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీలక నిర్ణయం! ఏంటంటే?
Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Revanth Reddy Comments: ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ల మీద పడింది మరిచావా కేసీఆర్?: టీపీసీసీ చీఫ్
Global EduFest 2023: ఫిబ్రవరి 10న 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023' నిర్వహిస్తున్న ఐఎంఎఫ్ఎస్
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి