Thurakapalem Deaths Mystery: తురకపాలెంలో మరణాలపై వీడిన మిస్టరీ- యురేనియం అవశేషాలు గుర్తింపు, చెన్నైలో నిర్ధారణ
Uranium found in water in Thurakapalem | గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో వరుస మరణాలతో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం దీనిపై ఫోకస్ చేసింది. చెన్నైలో చేసిన టెస్టుల్లో యురేనియం ఉన్నట్లు గుర్తించారు.

Dangerous Uranium found in Thurakapalem | అమరావతి: గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావడానికి, అసాధారణ మరణాలకు ప్రధాన కారణం అక్కడి నీటిలో ఉన్న యురేనియం అవశేషాలు ఉన్నట్టు అధికారులు నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధన కోసం గ్రామంలోని త్రాగు నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై, ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ల్యాబ్లకు పంపించారు. రెండు నెలల వ్యవధిలో 30 మందికి పైగా చనిపోవడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. జ్వరాలు వస్తున్నాయని ఆస్పత్రికి తీసుకెళ్తే మళ్లీ ఇంటికి తిరిగొచ్చే వారు తక్కువ అని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్న జ్వరాలకే ప్రాణాలు పోతున్నాయని, దీని వెనుక ఏదో పెద్ద కారణం ఉందని తురకపాలెం వాసులు అధికారులకు తెలిపారు. గత కొన్ని నెలలుగా గ్రామంలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ప్రాణాలు పోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.
జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(NCDC) ఆధ్వర్యంలోని వైద్య నిపుణులు గుంటూరు శివారులోని తురకపాలెంను మంగళవారం (సెప్టెంబర్ 9న) సందర్శించారు. అసాధారణ మరణాలకు కారణాలపై ఎన్సీడీసీ సంయుక్త సంచాలకురాలు డాక్టర్ హేమలత, నోడల్ అధికారి ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలోని బృందం గ్రామంలో సమీక్షించింది. గ్రామస్తులను అడిగి పరిస్థితి తెలుసుకుని, కొన్ని వివరాలు సేకరించారు.
తురకపాలెంలో యురేనియం అవశేషాలు గుర్తింపు
చెన్నైలో పరీక్షించిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అందులో తురకపాలెం పరిసరాల నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ ప్రాంతంలో రాళ్ల క్వారీలు విస్తారంగా ఉండటం, వాటిలోనే స్థానికులు పని చేయడం, అలాగే ఆ క్వారీ గుంతలలోని నీటిని వినియోగించడమే ఈ సమస్యకు కారణమయ్యుండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే, నీటిలో స్ట్రాన్షియం అనే హానికర మూలకం మరియు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు చెన్నై నివేదికలో తేలింది. అయితే, మొదటిసారిగా నిర్వహించిన పరీక్షల్లో మాత్రం బ్యాక్టీరియా కేవలం ఒకేచోటే ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై చెన్నై నివేదిక ఫలితాలు కొంత భిన్నంగా వచ్చాయని అధికారులు తెలిపారు.
యురేనియం ప్రభావంపై వైద్యుల హెచ్చరిక
యురేనియం మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది తాగునీరు లేదా ఆహార మార్గంలో శరీరంలోకి ప్రవేశిస్తే మొదటగా మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలుగుతుంది. అనంతరం చర్మ సమస్యలు, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలకు దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.
తురకపాలెం – గుంటూరు జీజీహెచ్ నివేదిక వివరాలు:
తురకపాలెం గ్రామం నుంచి గుంటూరు జీజీహెచ్ వైద్య కళాశాలలకు పంపిన 91 రక్త నమూనాల్లో ఒకటి బ్లడ్ కల్చర్ పరీక్షలో పాజిటివ్గా తేలింది. 64 నమూనాలు నెగెటివ్గా నిర్ధారించారు. వైద్యాశాఖ అధికారుల ప్రకారం, మెలియాయిడోసిస్ అనే వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా కాకపోయినా, ఇతర సూక్ష్మజీవుల ఆనవాళ్లు లభించాయి. అందులో 11 నమూనాల్లో కోకై గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా, 1 నమూనాలో ఎంఆర్ఎస్ఏ (MRSA), 4 నమూనాల్లో ఎంఎస్ఎస్ఏ (MSSA) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో చెన్నై ప్రయోగశాలకు పంపిన నమూనాల తాజా ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. యురేనియం అవశేషాలు ఉన్నాయని ఆ రిపోర్టులో వెల్లడైంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు






















