అన్వేషించండి

KTR : ఓడించారని ప్రజల్ని తప్పు పట్టవద్దు - పార్టీ నేతలకు కేటీఆర్ హితవు !

KTR BRS : ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించి తప్పు చేశారని అనొద్దని కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. రెండు సార్లు మనల్ని ప్రజలే గెలిపించారని గుర్తు చేశారు.


KTR Comments : బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ ప్రజలు తప్పుచేశారని కొంతమంది బిఆర్ ఎస్ నేతలు అక్కడక్కడా మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని  అలా  ప్రజలను తప్పుపట్టడం సరైంది కాదని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకుంటే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిందికూడా మన తెలంగాణ ప్రజలేననన్నది మరవకూడదని హితవు పలికారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.  

బిఆర్ఎస్ ను ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించలేదన్నారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూపించారన్నారు.   కొంతమంది చేయి గుర్తుకు వేసిన పెద్ద మనుషులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసిందన్నారు.  గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచింది.119 సీట్లల్లొ 39 గెలిచినం అంటే మూడోవంతు గెలిచినం. మిగతా 14 స్తానాల్లో కేవలం వందల్లో వేలల్లో ఓడామని..   అవికూడా గెలిచివుంటే పరిస్థితి వేరుగా వుండేదన్నారు. 

పరిపాలన మీద ద్రుష్టిపెట్టి పార్టీని పట్టించుకోలేదు.ఇందుకు పూర్తి బాద్యత తనదేనని కేటీఆర్ అన్నారు.  పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గాజరగలేదు. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపునివ్వలేకపోయామన్నారు.  నియోజవర్గాల్లో ఎమమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడంసరికాదు.. ఈ పదేండ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదు.  ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా  నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల వోటరుకు కార్యకర్తకు లింకు తెగిందన్నారు.  రేషన్ కార్డులు 6 లక్షలకు పైగా ఇచ్చినా జనంలోకి తీసుకెళ్లలేకపోయామన్నారు.  పెన్షన్లు కూడా కొత్తవి ప్రతినియోజవర్గంలో 15 వేలకు వరకు కొత్తగా ఇచ్చామనికాన చెప్పుకోలేకపోయామన్నరాు.  వందలో ఒక్కరికి రాకుంటే అదే నెగెటివ్ గా ప్రచారమైందన్నారు.  దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు వోపికపట్ట లేక అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారు. ఇతర కులాల్లో కూడా వ్యతిరేకత కానవచ్చిందన్నారు. 

రైతుబందు తీసుకున్న సామాన్య రైతుకూడా ఎక్కువ ఎకరాలున్న భూస్వామికి వస్తే వొప్పుకోలేదు.  వీటితో పాటు ఇంకా కొన్ని  కారణాలున్నాయని తెలిపారు. కాగా…అమలు చేసిన పథకాల ద్వారా  భవిష్యత్తులో తలెత్తబోయే ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని సరిగ్గా అంచనావేయలేకపోవడం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినట్టుగా తమ విశ్లేషణలలో తేలిందని కేటీఆర్ వివరించారు. రోజువారిగా జరుగుతున్న సమీక్షాలో వెల్లడౌతున్న అభిప్రాయాలను ఏరోజుకారోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నివేదిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. నూతన కాంగ్రేస్  ప్రభుత్వానికి  సంపూర్ణ సహకారం అందిద్దామనే సదుద్దేశంతో వున్న తమను కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వం రెచ్చగొడుతున్నదని కెటిఆర్ వివరించారు. 
 
 కొత్తగా ప్రబుత్వంలోకి వచ్చిన  వాళ్లు కుదురుకునేందుకు ప్రయత్నం చేయడం మానేసి ప్రతిపక్షంలో వున్న మనలను రెచ్చగొట్టుకుంటూ కాలం ఎల్లదీయాలనే ఎత్తుగడ  వేసిందన్నారు.   గెలుస్తామనే విశ్వాసం లేని స్థితిలో, అధికారం కోసం అర్రులు చాచి, అలవికాని హామీలిచ్చి నేడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేత ప్రతాల పేరుతో ప్రజల ద్రుష్టి మల్లించేందుకు కాంగ్రేస్ పార్టీ నాటకాలాడుతున్నదన్నారు. వీరి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని కెటిఆర్ అన్నారు.  కెసిఆర్ తయారుచేసిన జగదీశ్ రెడ్డి, తదితర తమ వంటి కార్యకర్తలే అసెంబ్లీలో ధీటుగా తిప్పికొడితే..త్వరలో  స్వయంగా కెసిఆరే అంసెంబ్లీకి వస్తే పరిస్తితి ఎట్లా వుంటుందో వూహించలేరన్నారు.  
 
ఓటమి కొత్తేం కాదని., అది స్పీడ్ బ్రేకర్ వంటిదేనని స్పష్టం చేసిన కెటిఆర్…పదేండ్ల పాటు విరామమెరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్ కు పోయిందే తప్ప షెడ్డులోకి పోలేదని చమత్కరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ కార్యకర్తలు నేతలు తమ సత్తాచాటాలని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పిలుపునిచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
GHMC MeeSeva WhatsApp Number: అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
అరచేతిలోనే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌! వాట్సాప్‌లోనే బర్త్‌ సర్టిఫికెట్‌ నుంచి 9 రకాల సేవలు!
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
Dairy Farm Scheme: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. 3% వడ్డీ రాయితీతో బ్యాంకు లోన్.. AHIDF స్కీమ్ అర్హతలు, అప్లై ప్రాసెస్
Crime Thriller Series OTT : ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
ట్రెండింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ - స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నారా?
Dharamsala Pitch Report: ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
ధర్మశాల పిచ్ రిపోర్ట్ - క్వాలిఫైయర్ 1 లో ఆర్‌సీబీ వర్సెస్ జీటీ.. ఎవరికి ప్లస్ కానుంది?
Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు
Pawan Kalyan on Nageshwar: జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
జగన్ ను అరెస్ట్ చేయమని అడిగే చీప్ కారెక్టర్ కాదు నాది.. అమిత్‌షాతో చెబితే ప్రొ. నాగేశ్వర్ విన్నారా..?
Embed widget