అన్వేషించండి

TRS Plenary 2021: ఆ సాక్ష్యాలు బయట పెడతా.. ఎన్నికల కమిషన్ చేసిన పని కరక్టేనా.. ప్లీనరీ ఏర్పాట్లలో కేటీఆర్

దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్  మాటల స్ఫూర్తితో ఉద్యమాలకు కొనసాగించామని చెప్పారు. 


14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను జాగృతం చేసి జాతీయ రాజకీయాలను శాసించే శక్తిగా తెలంగాణను తీర్చి దిద్దామని కేటీఆర్ అన్నారు. ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న.. తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉద్యమించామన్నారు. స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత అద్భుతమైన పరిపాలన, సంస్కరణలతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు  తెలంగాణతో కలిసి పోవాలని డిమాండ్ చేస్తున్నారంటే.. పాలన ఎంత అద్భుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. ఇలాంటి అద్భుతమైన పరిపాలన సాగుతున్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల సంబరాలను అట్టహాసంగా నిర్వహించుకుందామన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో ప్లీనరీని పార్టీ నిర్వహిస్తుందని చెప్పారు. 

'వారం పది రోజులుగా మా పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో అద్భుతమైన ఏర్పాట్లు చేసిన పార్టీ నాయకులకు హృదయపూర్వక అభినందనలు. ప్లీనరీకి సుమారు ఆరు వేలకు పైగా పార్టీ ప్రతినిధులు వస్తారు. వీరందర్నీ పార్టీ రంగు గులాబి దుస్తులు ధరించి రావాలని కోరుతున్నాం. పది గంటలకి ప్లీనరీ ప్రారంభం అవుతుంది. నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకొని 10.45 గంటల వరకు ప్లీనరీ ప్రాంగణంలోకి రావాలి. 11 గంటలకు సభ కార్యక్రమం ప్రారంభమవుతుంది.' అని కేటీఆర్ చెప్పారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 50 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈటల రాజేందర్ ఉమ్మడి అభ్యర్థి

కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ మాటను వారు కాదని చెప్తే.. దానికి సంబంధించిన సాక్ష్యాలను బయట పెడతానని చెప్పారు.  కరీంనగర్, నిజామాబాద్, నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఎలా చీకటి ఒప్పందంతో పోటీ చేశాయో.. అదేవిధంగా హుజూరాబాద్ లో అలానే చేస్తున్నాయని అన్నారు. 

 

'ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని చీకటి ఒప్పందాలు చేసినా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వాదిస్తారు. మాణిక్యం ఠాకూర్ 50 కోట్ల రూపాయలకు పీసీసీ పదవిని అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే చేసిన విమర్శలపై ఇప్పటివరకు స్పందించలేదు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ అగ్ర తాంబూలం ఇస్తుందని... కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. ఎన్నికల కమిషన్ సైతం తన రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకాన్ని ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తుందేమో.. అనిపిస్తుంది.' అని కేటీఆర్ అన్నారు.

Also Read: TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...

Also Read: Bandi Sanjay: లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్... కేంద్రం నిధులతో టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు... బండి సంజయ్ సంచలన కామెంట్స్  

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP DesamTirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు  
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Shock To Roja: వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
వైసీపీలోకి నగరి ఎమ్మెల్యే సోదరుడు - రోజాకు చెక్ పెట్టడానికి పెద్దిరెడ్డి స్కెచ్ వేశారా ?
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Embed widget