అన్వేషించండి

Singareni Issue: సింగరేణి అక్రమాలపై సిబిఐ కి సై - అవసరమైతే కేంద్రం స్వాధీనం -కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Singerani irregularities: సింగేరణి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరగాల్సి ఉందన్నారు.

CBI probe into Singerani irregularities:  సింగరేణి కాలరీస్ సంస్థలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న అక్రమాలపై తాము సీబీఐ   విచారణకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని  నైని  బొగ్గు గని టెండర్ల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. నైని గని గురించి విచారణ కోరుతున్న బీఆర్ఎస్ నేతలు, తమ హయాంలో  తాడిచర్ల  గనిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనంపై ఎందుకు మౌనంగా ఉన్నారు అని నిలదీశారు. గత పదేళ్లలో సింగరేణిని రాజకీయ అవసరాలకు వాడుకొని, సంస్థ ఆర్థిక పునాదులను దెబ్బతీశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. వాటిపైనా విచారణకు సిద్ధమన్నారు. 

సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ఆరోపణలు, సీబీఐ విచారణ డిమాండ్‌పై కిషన్ రెడ్డి స్పందించారు.  సీబీఐ విచారణకు కేంద్రం పూర్తి సుముఖంగా ఉందన్నారు. అయితే, సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతిపాదన రావాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వంలో జరిగిన తాడిచర్ల అక్రమాలు ,  ప్రస్తుత నైని బ్లాక్ వివాదాలపై విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే మరుక్షణమే సీబీఐ రంగంలోకి దిగుతుందని ఆయన హామీ ఇచ్చారు. అవసరం అయితే సింగరేణి నిర్వహణకు స్వాధీనం చేసుకునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉన్నారు.                      

సింగరేణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సైట్ విజిట్ సర్టిఫికేట్  నిబంధన కొత్త అక్రమాలకు దారితీస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.  దీనిపై సమగ్ర విచారణ అవసరమని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా సింగరేణిని అవినీతికి అడ్డాగా మార్చాయని, ఒకరి తప్పులను మరొకరు దాస్తూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. కేవలం నైని బ్లాక్ మాత్రమే కాకుండా, గత 12 ఏళ్లుగా సింగరేణిలో జరిగిన ప్రతి పాలసీ నిర్ణయం, టెండర్ల కేటాయింపుపై స్వతంత్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రుల వద్ద వాటాల విషయంలో తేడాలు రావడంతోనే విషయం బయటకు వచ్చిందన్నారు. 

తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని కాపాడుకోవడం తమ బాధ్యతని, కేంద్రం తన వాటా మేరకు సంస్థ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వాటాను సద్వినియోగం చేసుకొని పారదర్శకతకు సహకరించాలని కోరారు. రాష్ట్రం చెల్లించాల్సిన రూ. 30 వేల కోట్ల బకాయిల వల్ల సంస్థ ఆర్థికంగా చితికిపోతోందని, ఇప్పటికైనా రాజకీయం మానేసి వాస్తవాలను బయటపెట్టాలని సూచించారు. తాజా కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో సింగరేణి వివాదం ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రం మధ్య ఒక పెద్ద పొలిటికల్ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget