అన్వేషించండి

Loan Waiver Guidelines: తెలంగాణలో రైతు రుణమాఫీ - మార్గదర్శకాలపై కీలక అప్ డేట్ ఇదే!

Telangana News: తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా గైడ్ లైన్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

Key Update On Telangana Loan Waiver Guidelines: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే తెలంగాణలో రైతులకు రుణ మాఫీ (Farmer Loan Waiver) చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల కేబినెట్ భేటీలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.2 లక్షల రుణ మాఫీకి సంబంధించి అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2023, డిసెంబర్ 9కి ముందు రైతులు తీసుకున్న రుణాలపై మాఫీ వర్తింపచేస్తామని చెప్పారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా రైతుల సమక్షంలోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కాగా, నాలుగు రోజుల్లో రుణమాఫీ విధి విధానాలు విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గైడ్ లైన్స్‌పై ఫోకస్

అటు వ్యవసాయ శాఖ అధికారులు, ఇటు ఆర్థిక శాఖ అధికారులు గైడ్ లైన్స్ రూపకల్పనపై కుస్తీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇందుకు రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పలువురు అధికారులు పర్యటించి గైడ్ లైన్స్‌పై అధ్యయనం చేశారు. కేంద్రం అమలు చేస్తోన్న పీఎం కిసాన్ పథకం రూల్స్ రుణమాఫీకి వర్తింపచేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు, ఐటీ చెల్లించే వారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది.

నిధుల సమీకరణపై ఫోకస్

రుణ మాఫీ మార్గదర్శకాల విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో పథకం అమలుకు సంబంధించి నిధుల సమీకరణపైనా ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఇతర మార్గాలను కూడా చూస్తున్నట్లు సమాచారం. 

'వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభం'

అటు, వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రుణమాఫీతో ప్రభుత్వంపై రూ.31 వేల కోట్ల భారం పడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నారని ప్రశంసించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

Also Read: IPS Transfers: తెలంగాణలో మరో 8 మంది ఐపీఎస్‌లు బదిలీ, సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
Abhishek Manu Singhvi assets: కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget