అన్వేషించండి

Karimnagar: జైలు నుంచి పేపర్ లీక్ కేసు నిందితులు బయటికి, న్యాయపోరాటం చేస్తామని వెల్లడి

నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ మీడియాతో మాట్లాడాడు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పాడు.

తెలంగాణలో లీకైన పదో తరగతి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్టు అయి కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు బెయిల్ పై విడుదల అయ్యారు. ఏ2 - ప్రశాంత్, ఏ3 - మహేశ్, ఏ4 - గణేష్‌ నేడు (ఏప్రిల్ 12) ఉదయం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరైన ప్రశాంత్ మీడియాతో మాట్లాడాడు. పది హిందీ ప్రశ్నాపత్రం బయటకు రాగానే తాను ఓ జర్నలిస్టుగా జర్నలిస్టుల గ్రూపులో షేర్ చేశానని ప్రశాంత్ తెలిపాడు. ఆ గ్రూపుల్లో పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానని చెప్పాడు. తనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు. బండి సంజయ్ తో తాను ఒకేసారి 40 సెకన్లు మాత్రమే మాట్లాడానని చెప్పాడు. 

పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారణమైన వారి గురించి విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని వివరాలు చెప్పి పోలీసులకు సహకరించామని ప్రశాంత్ తెలిపాడు. ఒక జర్నలిస్టుగా తాను గతంలో విద్యార్థుల సమస్యలను బయటకు తెచ్చానని, వారి భవిష్యత్తు ఎలా పాడు చేస్తానని చెప్పాడు. తనకు బెయిల్ రావడానికి ఏ రాజకీయ పార్టీ సహకారం అందించలేదని చెప్పాడు. కోర్టు నుంచే నేరుగా బెయిల్ పొందినట్లు చెప్పాడు.

ఏప్రిల్ 4న హిందీ పరీక్ష పేపర్ లీక్ కావడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ప్రశాంత్‌ అనే జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెన్త్ పేపర్‌ను వాట్సప్‌లో ప్రశాంత్ పలువురికి షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా ఇంకొంత మందికి పేపర్ పంపినట్లు చెప్పారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ను ఉన్నట్టుండి గత వారం కరీంనగర్‌లో అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ1 గా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బండి సంజయ్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించగా, బండి సంజయ్‌ను కరీంనగర్‌ జైలుకు తరలించారు. హన్మకొండ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో గత శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. 

అలాగే నిన్న ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో పాటు బండి సంజయ్‌ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. తాజాగా కోర్టు ప్రశాంత్‌ సహా మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల అయ్యారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
Fatty Liver : కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
కాలేయ ఆరోగ్యం కోసం రోజూ 5 టిప్స్ ఫాలో అవ్వండి.. ఫ్యాటీ లివర్​ పూర్తిగా దూరమవుతుంది
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Embed widget