అన్వేషించండి

Singareni Privatization: సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రెడీ - ప్లేస్, టైమ్ ఫిక్స్ చేయాలని BRS నేతలకు ఈటల సవాల్

Singareni Privatization: కేంద్ర సర్కారు సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఈటల రాజేందర్ అన్నారు.

Singareni Privatization: ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారుపై హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ సర్కారు పదే పదే విషాన్ని చిమ్ముతోందని ఈటల మండిపడ్డారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటల.. సింగరేణిని కేంద్ర సర్కారు ప్రైవేట్ పరం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఈటల చెప్పుకొచ్చారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తేదీ, సమయం, ప్లేస్ చెబితే చర్చకు వస్తానని ఈటల్ సవాల్ చేశారు. 

సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన మాకు లేదు

సింగరేణి సంస్థను ప్రైవేటైజేషన్ చేసే ఆలోచన తమకు లేదని రామగుండం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని ఈటల గుర్తు చేశారు. సింగరేణి విధివిధానాలపై రాష్ట్రానిదే పెత్తనం అని, కేంద్ర సర్కారు వాటిలో జోక్యం చేసుకోలేదని ఈటల తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణనా లేదా బొగ్గు గనుల ప్రైవేటీకరణనా కేసీఆర్ చెప్పాలని ఈటల అన్నారు. బొగ్గు, మట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని, ప్రభుత్వం ఎందుకు ఆ పనులు చేయడం లేదని ఈటల బీఆర్ఎస్ నాయకులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. సింగరేణిలో మూడు బొగ్గు గనులను ప్రైవేట్ వారికి ఇచ్చి మైనింగ్ చేస్తుంది నిజామా కాదా అని ఈటల ప్రశ్నించారు. సింగరేణి కంపెనీకి ఇవ్వాల్సిన 20 కోట్ల రూపాయల బాకీలను రాష్ట్ర సర్కారు ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని ప్రశ్నలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తున్న కేసీఆర్.. మొదట తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఆర్టీసీకి న్యాయం చేయాలని ఎద్దేవా చేశారు.

ఇష్టానుసారంగా 216 మైన్స్ కేటాయించడం వల్ల లక్షా 86 వేల కోట్ల నష్టం

ఆర్టీసీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అజాంజాహి మిల్లు లాంటి తెలంగాణ సంస్థల  గురించి ఆలోచించి, వాటిని అభివృద్ధి చేసి ఇతరవాటి గురించి ఆలోచించాలని ఈటల రాజేందర్ చురకలంటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ పురోగమిస్తుందని ఈటల ధీమా వ్యక్ం చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు కేసీఆర్ 25 కోట్ల రూపాయలు ఇచ్చారని ఈటల ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని తెలిపారు. ఎన్నికల ముందు లేదా తర్వాత రెండు పార్టీలు కలుస్తాయని, ఇది ఖాయమని ఈటల జోస్యం చెప్పుకొచ్చారు.

6300 కోట్ల రూపాయలతో రామగుండంను ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించిన సందర్భంగా.. 51 శాతం రాష్ట్రం వాటా ఉన్న తర్వాత కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లు ఈటల గుర్తు చేశారు. దానికి సమాధానం చెప్పలేని సీఎం కేసీఆర్... ఇప్పుడు మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మైన్స్ మినరల్స్ రెగ్యులేషన్ ఆక్ట్ 1957 ప్రకారం యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా 216 మైన్స్ కేటాయించడం వల్ల లక్షా 86 వేల కోట్ల నష్టం జరిగింది అని కాగ్ రిపోర్ట్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Breaking News: మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
మహారాష్ట్రలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి
Bandi Bhagirath Bail: పోక్స్ కేసులో బండి భగీరథ్‌కు కండిషనల్‌ బెయిల్‌! పరీక్షల కోసం మధ్యంతర ఊరట!
పోక్స్ కేసులో బండి భగీరథ్‌కు కండిషనల్‌ బెయిల్‌! పరీక్షల కోసం మధ్యంతర ఊరట!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Balakrishna: అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
అమ్మ క్యాన్సర్ బాధ నుంచే బసవతారకం ఆసుపత్రి ఆలోచన.. నందమూరి బాలకృష్ణ భావోద్వేగం
Tungabhadra Dam New Gates Inauguration 2026: తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
తుంగభద్ర సరికొత్త రికార్డు - 25న చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ చేతుల మీదుగా 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవం!
Duvvada Madhuri Kotturu Police Station: దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
దువ్వాడ కోసం ఎందాకైనా.. పోలీస్ స్టేషన్ ఎదుట దివ్వెల మాధురీ హంగామా - అసలు కేసేమిటంటే?
Revanth Reddy Delhi Tour: రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం.. సాయంత్రం ఒకే సమావేశంలో కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం
AP Weather Update Rains: ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక - కాకినాడ, రాజమండ్రి, తిరుపతిలో దంచికొట్టనున్న వానలు.. జాగ్రత్త పడండి!
Keir Starmer Resigns UK PM 2026: బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజీనామా! 10 ఏళ్లలో ఏడో పీఎం.. ఎందుకీ రాజకీయ అస్థిరత?
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
Sreeleela : శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
శ్రీలీలకు అవమానం జరిగిందా? - అసలు నిజం ఏంటో తెలుసా?
Embed widget