అన్వేషించండి

Telangana Gurukul Schools: జిల్లాకు మరో గురుకుల పాఠశాల, కాలేజీ మంజూరు - ఉత్తర్వులు జారీ

కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.

బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కరీంనగర్ జిల్లాలో కొత్తగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల... మరియు మరో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాలో కూడా బీసీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలను ఏర్పాటు కాగా ప్రతి సంవత్సరం వాటిలో ప్రవేశాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ పోటీ ఎదురవుతోంది. వాటిలో సీట్లు సాధించాలని వారు ఎలాగైనా ప్రవేశాలు పొందాలని ఆసక్తితో అధికారులు, నేతలను ఆశ్రయిస్తున్నారు. 
ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో మరిన్ని గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో జిల్లాకు ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాకు కొత్తగా మంజూరైన బీసీ గురుకుల బాలికల పాఠశాలలో భవనంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అనువైన అద్దె భవనాలను  సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. శివారుతో పాటు నగరంలోని కొన్ని భవనాలు ఇప్పటికే గుర్తించినా బాలికల పాఠశాల కావడంతో నగరంలోని భవనంలోనే దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం కల్పిస్తూ కోసం ప్రయత్నం కొనసాగుతోంది. ప్రస్తుతం విద్యాలయాలకు దసరా సెలవులు ప్రారంభమవుతున్న సమయంలో సెలవుల అనంతరం ఈ గ్రూపులో పాఠశాలను వచ్చే నెల రెండో వారంలో ప్రారంభం చేయడానికి  ఏర్పాట్లు చేస్తున్నారు. 
కొత్తగా ఏర్పాటయ్యే ఈ స్కూల్ లో 5, 6, 7 తరగతుల్లో బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెషన్లలో 80 మంది బాలికలకు అవకాశం దక్కనుంది. ఈ లెక్కన మొత్తం 270 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో పది గురుకుల పాఠశాలలు ఉండగా, వాటిలో  4969 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్తగా ఇతరులకు ప్రవేశాలు కల్పించే విషయాన్ని సైతం ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా గల 26 గురుకుల పాఠశాలలో 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న బీసీ గురుకుల, డిగ్రీ కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు మంజూరయ్యాయి. కరీంనగర్ లో బాలికలు రాజన్న సిరిసిల్ల, పెద్దపెల్లి జిల్లా లో బాలుర విభాగంలో డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. వాటిలో ఎనిమిది రకాల డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఒక్కో కళాశాలలో 320 మందికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనట్లు తెలుస్తోంది. వాటిని సైతం అద్దె భవనాల్లోనే వచ్చే నెలలో ప్రారంభించేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలల్లో కొత్తగా ఏర్పాటవుతున్న వీటితో పలువురు విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
Mahatma Jyotiba Phule, Karimnagar, BC Gurukul School, Telangana
కరీంనగర్, మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, గురుకుల పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget