By: ABP Desam | Updated at : 23 Sep 2022 10:44 PM (IST)
Edited By: jyothi
జిల్లా ఆస్పత్రిలో జాబుల పేరుతో దందా- జడ్పీటీసీలు ఆగ్రహం
Karimnagar News: కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగాల పేరుతో దళారులు దందా చేస్తున్నారని జడ్పీటీసీలు ఆరోపించారు. ఇతర సేవల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇందుకోసం లక్ష నుండి లక్షన్నర రూపాయలు ఇచ్చిన వారికి అవకాశం ఇస్తామని దళారుల అక్రమాలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల వైఖరిపై జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కరీంనగర్ లోని జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను నిలదీశారు. నామమాత్రంగా సమావేశాలకు హాజరు అవుతున్నారని ప్రతి సమావేశంలో తమ ఇబ్బందులను తేలిగ్గా తీసుకుంటున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
'ఆస్పత్రిలో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెప్పండి'
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పనితీరును సభ్యుల ముందు ఉంచారు. మానకొండూరు జడ్పీటీసీ సభ్యులు శేఖర్ రావు మాట్లాడుతూ, జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగం కోసం తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా ఆస్పత్రిలో అసలు ఏ తరహా పోస్టులను భర్తీ చేస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వాలని సూపరింటెండెంట్ ను నిలదీశారు.
'ప్రజాప్రతినిధులను ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవట్లేదు'
ఆసుపత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్స విషయంలోనూ లోపాలు ఉన్నాయని, ప్రజాప్రతినిధిగా ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదని ఆయన అన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు జరగడం లేదని, ఇందులో తమకు సభ్యులుగా అవకాశం కల్పించాలని శంకరపట్నం జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కోరారు. సదరన్ ధ్రువపత్రాలను సకాలంలో ఇవ్వకుండా జిల్లా ఆస్పత్రి డీఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జమ్మికుంట జడ్పీటీసీ సభ్యులు శ్రీరామ్ శ్యామ్ తెలిపారు. పింఛన్లు అందుకోవాలి అనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి కరీంనగర్ లోని క్యాంపునకు బాధితులు వెళ్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. శంకరపట్నం మండలం లోని దళితవాడలో విద్యుత్ సరఫరా నిలిపి వేశారని శ్రీనివాస్ రెడ్డి తెలపడంతో స్పందించిన మంత్రి గంగుల.. అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని డీఈని ఆదేశించారు.
'గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి'
ఎస్సారెస్పీ భూముల పలుచోట్ల ఆక్రమణకు గురవుతున్నాయని, ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారని కో-ఆప్షన్ సభ్యులు శుక్రవారం సమావేశంలో చెప్పారు. కాకతీయ కాలువ సమీపంలో ఇవి అధికంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశించారు. వైకుంఠధామాలు ప్రారంభించకపోవడంతో గ్రామాల్లో ఇబ్బంది ఎదురవుతోందని కొందరు సభ్యులు తెలుపగా.. వాటి విషయమై అధికారులతో మాట్లాడుతానని, ఎక్కడా ఇబ్బంది ఉందో తెలుసుకుంటామని ఛైర్ పర్సన్ విజయ తెలిపారు. దళిత బంధు కింద లబ్ది దారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లకు సంబంధించిన పురోగతిని జడ్పీ ఛైర్ పర్సన్ విజయ సంబంధిత అధికారులను అడిగారు. ఆయా నియోజకవర్గాల వారీగా గ్రౌండింగ్ వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారిగా నాగార్జున తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు యువతకు ఉపయోగపడేలా ఉండేలా చూడాలని కొందరు సభ్యులు కోరారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్మన్ విజయ, కలెక్టర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
NITW: వరంగల్ నిట్లో గ్రూప్-డి పోస్టుల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Teachers Transfer: సెప్టెంబరు 28 నుంచి స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు, జోన్లవారీగా బదిలీలు ఇలా
TS TET 2023 Results: తెలంగాణ 'టెట్' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?
Chandramukhi 2 Review: చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?
/body>