అన్వేషించండి

Telangana Congress News : కాంగ్రెస్‌లో జానారెడ్డి ఆపరేషన్ - రేవంత్‌తో చేతులు కలిపిన సీనియర్లు ! జగ్గారెడ్డి ఒంటరేనా ?

రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ల మధ్య జానారెడ్డి సఖ్యత కుదిర్చారు. నల్లగొండ నిరుద్యోగ ర్యాలీతో కాంగ్రెస్‌లో ఐక్యత కనిపిస్తోంది.


Telangana Congress News :  కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి రాక సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో తమకు సమాచారం లేదని కీలక నేతలు వాయిదా వేయించిన  నిరుద్యోగ నిరసన ర్యాలీ సభను శుక్రవారం నిర్వహించారు.  ఎంపీలు ఉత్తమ్​ కుమా ర్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హాజరయ్యారు. జిల్లా అగ్రనేతలు అందరూ రేవంత్​ సభలో పాల్గొనడం, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేయడం పార్టీ కేడర్​లో జోష్​ నింపింది.                              

ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, వెంకట్​రెడ్డి సొంత నియోజకవర్గాల ఎమ్మెల్యేలను టార్గెట్​ చేసి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జానారెడ్డి చేసిన కృషిని వివరించడమేగాక, మంత్రి పదవి త్యాగం చేసిన వెంకట్​ రెడ్డిని కొండా లక్ష్మణ్​ బాపూజీతో పోల్చారు. పౌరషం కలిగిన వ్యక్తి దామోదర్​ రెడ్డి అని కీర్తించడ మేగాక, సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డిని టార్గెట్​ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్​టాపిక్​గా మారాయి.                           

నల్గొండలో రేవంత్​ సభను సక్సెస్​ చేయడంలో  జానారెడ్డి కీలక పాత్ర పోషించారు.  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ నేతలందరని ఏకతాటికి పైకి తీసుకొచ్చే బాధ్యతను   జానారెడ్డి భుజానెత్తుకున్నారు. ఇదే రకమైన పంథాను ఎన్నికల్లోనూ కొనసాగుతుందని జానారెడ్డి అన్నారు. పార్టీ గెలుపు కోసం, తాను సమైఖ్య యోధుడిగా పాటుపడతానని చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా తామంతా కలిసికట్టుగానే ఉన్నామని, చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిన్నింటిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేస్తామని ఎంపీ వెంకట్ రెడ్డి సైతం రేవంత్‌కు ​మద్దతు తెలిపారు. ప్రధాని మోడీని కలినంత మాత్రాన బీజేపీలో చేరినట్టుకాదని, అట్లాగే రేవంత్​ నల్గొండకు రానంత మాత్రాన తాను అడ్డు చెప్పినట్టు కాదని, పరి స్థితులను బట్టి తామే రేవంత్‌​ను నల్గొండకు ఆహ్వానిద్దామని అనుకున్నా మని వెంకట్​రెడ్డి వివరణ ఇచ్చారు.                      

ఉత్తమ్​ కుమార్​ రెడ్డి మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో 12 సీట్లు గెలిచి సాధిస్తామన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సైతం పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరూ కలిసికట్టుగానే ఉన్నామని చెప్పారు. మొత్తం మీద ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సభకు రావడం, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయడం పార్టీలో కొత్త ఊపు తీసుకొచ్చింది. దీంతో సీనియర్లు అంతా మరోసారి ఏకమయినట్లు అంది. అయితే జగ్గారెడ్డి మాత్రం వరుసగా లేఖలు విడుదల చేస్తూ.. తాను అసంతృప్తిగానే ఉన్నానని సంకేతాలు పంపుతున్నారు. తాజాగా పాదయాత్రకు అనుమతి కోరుతూ లేఖ కూడా రాశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Embed widget