Telangana Weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, కోస్తాంధ్రకు IMD ఆరెంజ్ అలర్ట్
Telangana Weather: తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Telangana Weather: ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తనం ఈరోజు సముద్ర మట్టానికి 7.6 కిమీ ఎత్తు వరకు అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలో అక్కడక్కడా రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధ, గురు వారాల్లో కూడా దీని ప్రభావం కొనసాగుతుందని వివరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఈరోజు, మంగళ వారం రోజు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వాయువ్య/పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా..
ముఖ్యంగా కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు కోస్తాంధ్ర, యానాంకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 11.5 సెంటీ మీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాసం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ‘‘తెలంగాణ - ఆంధ్రా బార్డర్ పరిధిలో ముఖ్యంగా కర్నూలు, నంధ్యాల జిల్లాలను ఆనుకొని ఏర్పడుతున్న గాలుల సంగమం బలపడింది. దీని వలన రానున్న మూడు గంటల వరకు కర్నూలు నగరంతో పాటుగా నంధ్యాల నగరం, అలాగే నంధ్యాల జిల్లాలోని వివిధ భాగాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలను చూడగలము. అలాగే మరో వైపున విజయనగరం జిల్లా భోగాపురం - భీమిలీ మధ్యన మరో భారీ వర్షం బంగాళాఖాతాన్ని ఆనుకొని పడుతోంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















