అన్వేషించండి

Telangana News: అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదు.. వాళ్లు వెళ్తే పైరవీలు, మేం వెళ్తే ప్రయోజనాలు.. టీఆర్ఎస్ నేతలు ఫైర్

Paddy Procurement In Telangana: తెలంగాణ మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం రాష్ట్రాన్ని అవమాన పరచడమేనని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారని.. తెలంగాణ మంత్రులను ఢిల్లీకి ఎవరు రమ్మన్నారు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం రాష్ట్రాన్ని అవమాన పరచడమేనని రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. గత నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం ఢిల్లీలో పోరాడుతున్నారని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళితే.. మేము మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామని .

తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ పడ్డ కష్టం అందరికీ తెలుసునని.. చావు నోట్లో తలకాయ పెట్టిన నేత టీఆర్ఎస్ అధినేత అని గుర్తు చేశారు. అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదు అన్నారు. తెలంగాణ నేతలను బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు బిచ్చగాళ్లుగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ పూర్తిగా కేంద్రం భాద్యతే, కానీ తప్పించుకునే ప్రయత్నంలో బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు ఏం చెప్పారు, ఇపుడు ఏం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని చెప్పి మోదీ మాట తప్పారన్నారు.

‘తెలంగాణ మంత్రులను అవమాన పరిచి, ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మంచి చేస్తే దేశమంతా తిరిగి కేంద్రం మంచి చేసిందని చెబుతాం. చెడు చేస్తే దానికి తగ్గట్టే వ్యవహరిస్తాం. మా మంత్రులు పరిస్థితుల ప్రభావంతో హైదరాబాద్‌కు తిరిగి రావొచ్చు. కానీ పులి రెండు అడుగులు వెనకేసినంత మాత్రానా సినిమా పూర్తి కాలేదుని గుర్తుంచుకోండి. రైతుల కోసం అన్ని పార్టీలు ఒక్కటైన సందర్భాలు అనేకం. కానీ తెలంగాణ లో ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల ఆగ్రహానికి బీజేపీ గురి కాక తప్పదు.

వరి వేయాలా.. వద్దా ?
యాసంగి లో వరి వేయాలా వద్దా స్పష్టంగా కేంద్రం స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద కోపంతో, అధికార దాహంతో బీజేపీ తెలంగాణ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కన్నా గొప్పగా ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇది ఓ తెలంగాణ సమస్య కాదు. దేశ రైతులు కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ పిలుపు కోసం వారు ఎదురు చూస్తున్నారు. పంజాబ్‌కు ఓ విధానం.. విధానం కర్ణాటకకో విధానం.. తెలంగాణకు ఓ విధానమా..?  రైతులను మోసం చేయాలని చూస్తే తెలంగాణ ఆగ్రహానికి కేంద్రం గురికాక తప్పదు. క్షమాపణ చెప్పి రాష్ట్ర రైతులకు కేంద్రం న్యాయం చేయాలి. ధాన్యం సేకరణపై కేంద్రం హామీ లేఖ ఇస్తే ఢిల్లీ ఒడిపోయినట్టు కాదు. రైతులు గెలిచారనుకోవాలి. 

తీర్మానాలను పక్కనపెట్టిన కేంద్రం..
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకున్న తీర్మానాలను ఢిల్లీకి పంపించినా తెలంగాణకు న్యాయం చేయడం లేదు. బీసీ గణన, ఎస్సీ వర్గీకరణ, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తెలంగాణ తీర్మానాలను పక్కన పెట్టడం నిజం కాదా.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదని, ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు మా వద్ద వ్యూహాలున్నాయి. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగు పడదు. కనుక కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రైతుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.

Also Read: Medaram Jatara 2022: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మేడారం జాతరకు వారికి అనుమతి లేదు..! యోచిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం

Also Read: Sangareddy: పగలంతా ఫుడ్ డెలివరీ బాయ్స్.. రాత్రికి పాడు పనులు, కిటికీల వద్దకు వెళ్లి..

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Embed widget