అన్వేషించండి

Sigachi Letter On Incident: ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం

పాశమైలారంలో జరిగిన ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు అని సిగాచీ సంస్థ ప్రకటించింది. మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం ప్రకటించారు.

పాశమైలారం: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ కెమికల్స్ లో జరిగిన ప్రమాదంపై కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. ఇటీవల తమ కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో 40 మంది మృతి చెందారని సిగాచి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో మరో 33 మంది గాయపడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని సిగాచీ యాజమాన్యం తెలిపింది. సిగాచీ ఇండస్ట్రీస్ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్‌ కుమార్‌ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

మృతుల కుటుంబాలకు పరిహారం..
తమ కంపెనీలో జరిగిన పేలుడులో  మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు చొప్పున పరిహారం ఇస్తామని సిగాచీ బుధవారం నాడు ప్రకటించింది. అన్ని రకాల క్లెయిమ్స్ చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. గాయపడిన వారికి వైద్య చికిత్సకు ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 3 నెలల వరకు ప్లాంట్‌లో కార్యకలాపాలు సిగాచీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ప్రమాదానికి సంబంధించి స్టాక్ మార్కెట్లకు వివేక్‌ కుమార్‌ లేఖ రాశారు. సిగాచీలో జరిగిన ప్రమాదానికి రియాక్టర్‌ పేలుడు కారణం కాదని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రభుత్వ విచారణ చేపట్టిందని, కారణాలపై అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తుట్లు తెలిపారు. 


Sigachi Letter On Incident: ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం

సిగాచీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై తేలని లెక్కలు..

పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ లో సోమవారం జరిగిన ప్రమాదంలో 36 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే హాస్పిటల్ లో అంతకంటే ఎక్కువ మృతదేహాలు ఉన్నాయని, తమ వారి డెడ్ బాడీస్ గుర్తించి అప్పగించాలంటూ బాధితుల బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శవాలను సరిగ్గా చూడటం లేదని, మొత్తం ఎంత మంది చనిపోయారో, గాయపడ్డ వారు ఎందరో ఇంకా తేల్చడం లేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు బిఎస్‌ఇలో భారీగా పతనం
సోమవారం సిగాచీ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ రోజు ఉదయం 58 రూపాయలు పైగా ఉన్న షేర్లు ఒక్కసారిగా ఇంట్రాడేలో 47.5 రూపాలయలకు పతనమయ్యా్యి. జులై1న సైతం సిగాచీ షేర్ ధర మరో రెండు రూపాయలు తగ్గింది. జులైన బుధవారం నాడు ఇంట్రాడేలో మరో 6.5 శాతం షేర్ ధర పతనమైంది. వార్త రాసే సమయానికి రూ.42.90 పైసల వద్ద ట్రేడ్ అవుతోంది.

పాశమైలారం సీగాచి పరిశ్రమ యజమాన్యానికి చెందిన ఒకరు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడ్డ వారిని పరామర్శించడానికి వచ్చారు. అనంతరం చిదంబరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సిగాచి పరిశ్రమ ముగ్గురు పార్టనర్ షిప్ లో నడుస్తుంది. 1.అమిత్ రాజ్ సిన్హా MD CEO , 2.చిదంబరం వైస్ చైర్మన్, 3.రవీంద్ర ప్రసాద్ సిన్హా ఛైర్మన్ గా ఉన్నారు. 


Sigachi Letter On Incident: ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదు: మృతుల కుటుంబాలకు సిగాచీ రూ.1 కోటి పరిహారం

గతంలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. వైస్ చైర్మన్ చిదంబరం నాథ్

‘గత 35 సంవత్సరాలుగా కంపెనీ నడుపుతున్నాం. ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు. ఐదు సంవత్సరాల క్రితం కంపెనీని ఎలాంగో గౌడకు లీజుకు ఇచ్చాము. ప్రస్తుతం సిగాచీ కంపెనీ బాధ్యతలు అతనే చూస్తున్నాడు. ప్రమాదంలో ఎలాంగో గౌడ కూడా మృతి చెందారు. పూర్తివివరాలు మా వద్ద కూడా లేదు. ఎక్స్పర్ట్ పర్సన్స్ తో మాట్లాడి నిర్ణయం తుది తీసుకుంటాం. బాధితులకు న్యాయంగా భారీ పరిహారం చెల్లిస్తాం. అగ్ని ప్రమాదం కేసు విషయం మా కంపెనీ అడ్వకేట్ లు చూసుకుంటారు అని’ చిదంబరం నాథ్ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
India Richest MLA: దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
దేశంలో అత్యంత ధనిక, పేద ఎమ్మెల్యేలు వీరే.. ఆస్తుల వ్యత్యాసం రూ.3383 కోట్లు
Adilabad Road Accident: లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొని ఇద్దరు మృతి.. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Vanavaasam Song Lyrics: వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
వనవాసం సాంగ్ లిరిక్స్... సుమ కనకాల కొడుకు రోషన్ 'మోగ్లీ'లో కొత్త పాట... రామాయణం గుర్తు చేసేలా!
Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Embed widget