అన్వేషించండి

Sigachi Blast Incident: లెక్క తేలని సిగాచి పేలుడు మృతుల సంఖ్య! బాధితుల కుటుంబాల్లో ఆందోళన

Sigachi Industries Blast Incident | సంగారెడ్డి జిల్లాలోని సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్యపై క్లారిటీ రావడం లేదు. బాధిత కుటుంబాలు తమ వారి కోసం కన్నీళ్లు పెడుతున్నాయి.

సంగారెడ్డి: సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం నెలకొంది. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా ఇంకా మృతదేహాల సంఖ్య, గాయపడిన వారి వివరాలు కొలిక్కిరాలేదు. 143 మందే డ్యూటికి వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సిగాచి కెమికల్స్ నుంచి వివరాలు సరిగ్గా లేకపోవడం ఇప్పటి వరకు సరిగా లెక్కలేని మృతులు, క్షతగాత్రుల సంఖ్య. అధికారులు చెబుతున్న లెక్కకు, మార్చురీ వద్ద మృత దేహాల లెక్కలకు మధ్య తేడా ఉంది. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అధికారులు వివరాలు చెప్పలేకపోతున్నారు. 

అధికారుల లెక్కల ప్రకారం 36 మంది మృతి చెందారు, 34 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కానీ ఇప్పటి వరకు 45 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తున్నా అధికారులు ధ్రువీకరించడం లేదు. మరోవైపు సిగాచి సంస్థ యాజమాన్య అటువైపు కన్నెత్తి చూడటం లేదు. యాజమాన్యం నుంచి ఏ ఒక్కరు వచ్చి పరిశీలించడకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.  


Sigachi Blast Incident: లెక్క తేలని సిగాచి పేలుడు మృతుల సంఖ్య! బాధితుల కుటుంబాల్లో ఆందోళన

14 మంది పేర్లు అధికారికంగా ప్రకటించిన అధికారులు..

ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 14 మంది పేర్లు అధికారులు ప్రకటించారు. మనోజ్ రౌత్. జి నిఖిల్, శ్రీ రమ్య, వి ఆర్ జి నాగేశ్వరరావు, సునీల్ కుమార్, తేనా సుందర్, లంగజిత, రుస్తాన్ కథున్, జగన్మోహన్, జయ ప్రసన్న, హేమ సుందర్, శశి భూషణ్, గోవింద్ సాహూ, రామ్ సింగ్ లు మరణించినట్లు ప్రకటించారు.

సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు
పాశమైలారంలోని సిగాచి కెమికల్స్ కంపెనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 36 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదుతో సిగాచి యాజమాన్యంపై 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పలువురు కాలిన గాయాలతో పటాన్ చెరు లోని ఆస్పత్రి, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో అగ్నిప్రమాదం జరిగిన సిగాచి కెమికల్స్ ఇండస్ట్రీకి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతపెద్ద ప్రమాదం జరిగితే సిగాచి నుంచి యాజమాన్యంలో ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.1 కోటి, గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటించారు. అయితే తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.1 లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. తక్షణమే వారికి నగదు అందజేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఆదేశించారు. 

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ACB Raids On DSP Bheem Reddy: ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
ఏసీబీ వలలో సైబరాబాద్ డీఎస్బీ భీమ్ రెడ్డి - ఈ సారు లెక్క కూడా దాదాపుగా వంద కోట్లే !
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
BRS Leader Harish Rao Arrest: తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!
తెలంగాణలో గురుకులాల టెండర్లపై రగడ! మంత్రులతో చర్చకు సిద్ధమైన బీఆర్‌ఎస్‌ నేతలు! పోలీసుల అడ్డగింత, అరెస్టు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget