అన్వేషించండి

Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్

సికింద్రాబాద్ చిలకలగూడలో యువకుడు యావన్ హత్య కేసును ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా తేల్చిన పోలీసులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు.5 రోజుల ముందే స్కెచ్ వేసి ఈ హత్య చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

హైదరాబాద్: మే 7న సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో సంచలనం సృష్టించిన యువకుడు యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన 'ప్రీ ప్లాన్డ్ మర్డర్' అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించారు. యువతిని పెళ్లి చేసుకోవాలని భావించిన బావ.. ఆమె ప్రేమ వ్యవహారం నచ్చక బీటెక్ విద్యార్థి హత్యకు ప్లాన్ చేశాడు. మరదలు తనకు దక్కదన్న భయంతో ఆమె ప్రియుడు యావన్‌ను ప్లాన్ చేసి యువతి కుటుంబ సభ్యుల సహకారంతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 5 ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం 10 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. 

మరదలు తనకు దక్కదనే కోపంతో యువకుడి హత్య..

సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. యావన్, అమ్మాయి స్కూల్ రోజుల నుంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలో గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు గతంలోనే యావన్‌ను హెచ్చరించారు. అయినప్పటికీ యావన్ తమ అమ్మాయి వెంట తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమ్మాయి బావ అల్లబోయిన సాయికిరణ్ ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. కుటుంబసభ్యులు సైతం అందుకు సిద్ధంగానే ఉన్నారు.  వారు వినకపోవడంతో, యువతి బావ అల్లబోయిన సాయి కిరణ్ (A1) హత్యకు ప్లాన్ వేశారు. సాయి కిరణ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో అతడిపై గతంలో కేసులు ఉన్నాయి. యువతిని తాను పెళ్లి చేసుకోవాలని భావించిన సాయి కిరణ్, ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు.


Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్

అరెస్టైన నిందితుల వివరాలు
-  ఏ1 సాయి కిరణ్‌ (అమ్మాయి బావ)
-  ఏ2 రాజాం పరమేశ్‌(అమ్మాయి అన్న)
-  ఏ3 రాజాం వంశీకృష్ణ
-  ఏ4 రాజాం మనీశ్‌
-  ఏ5 శ్రీగిరి రాహుల్‌
-  ఏ6 కుచ్చుల శివనందన్‌
-  ఏ7 రాజాం నరసింహ (అమ్మాయి తండ్రి)
-  ఏ8 రాజాం శ్రీశైలం (అమ్మాయి బాబాయ్‌)
-  ఏ9 రాజాం మల్లేశ్‌ (అమ్మాయి బాబాయి)
-  ఏ10 మైనర్‌ బాలుడు 

5 రోజుల ముందే హత్యకు ప్లాన్..
యావన్ హత్యకు ఐదు రోజుల ముందే నిందితులందరూ కలిసి రెక్కి నిర్వహించారు. మే 7 అర్ధరాత్రి యావన్‌ను ప్లాన్ ప్రకారం దాడి చేసి హత్య చేశారు. 16, 17 సార్లు కత్తితో పొడవగా తీవ్ర రక్తస్రావంతో అతడు చనిపోయాడు. యావన్ ఓ స్నేహితుడి ఇంటి వద్ద ఉన్నాడని తెలుసుకుని ఈ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ఒక్కసారిగా యావన్‌పై కత్తితో దాడి చేయగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ కేసులో యువతి బావ, తండ్రి, బాబాయ్‌లు, సోదరుడు, కజిన్ బ్రదర్స్ సహా మొత్తం 9 మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుల వద్ద నుండి ఒక కత్తి, మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరికి గాంజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని డీసీపీ వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో ఏ5 శ్రీగిరి రాహుల్‌, ఏ6కుచ్చుల శివనందన్‌కు గంజాయి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. నిందితుల్లో సగం మంది 21, 22 ఏళ్లలోపే వారే ఉన్నారు. చిన్న వయసులోనే యువకులు హత్య కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని.. దురలవాట్ల కారణంగానే ఇలా ప్రవర్తిస్తున్నారని డీసీసీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget