By: ABP Desam | Updated at : 01 Jun 2022 12:49 PM (IST)
కార్యక్రమంలో మాట్లాడుతున్న కేటీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 8 ఏళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. చివరికి కరోనా పరిస్థితుల నడుమ కూడా అద్భుతమైన ఐటీ ఎగుమతులు చేసి, మెరుగైన వృద్ధి సాధించామని అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021 - 22 ఏడాదికి గానూ ఐటీ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య కూడా బాగా పెరిగిందని కేటీఆర్ అన్నారు. గత ఏడాదిలో దేశ వ్యాప్తంగా 4.5 లక్షల ఐటీ ఉద్యోగాలు లభిస్తే ఒక్క హైదరాబాద్ లోనే లక్షన్నర వరకూ వచ్చాయని గుర్తు చేశారు. 2021 - 22 ఏడాదిలో ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83 లక్షల కోట్లుగా ఉంటుందని, 2035 నాటికి ఈ సంఖ్యను రూ.2.9 లక్షల కోట్లకు పెంచామని అన్నారు. ఐటీ, అనుబంధ రంగాల్లో పరిశ్రమల ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం పెరుగుదల సాధించామని చెప్పారు. జాతీయ సగటు కంటే 9 శాతం అదనంగా పెరుగుదల సాధించినట్లుగా కేటీఆర్ వివరించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, ఈ నెల 20న టీ హబ్ రెండో దశ ప్రారంభిస్తామని చెప్పారు. టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టులోనే ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ వివరించారు.
ఇదీ మన తెలంగాణ !!
డబుల్ ఇంజిన్ పేరుతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనవుతుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్యని రెట్టింపు చేసింది.@KTRTRS #TriumphantTelangana #ITisTelangana pic.twitter.com/AXp8P6F6ro— Chittem Rammohan Reddy (@ChittemRRTRS) June 1, 2022
I feel that Telangana Govt means business and understands business. We get immense support from Govt, that is reflected in the growth that we're seeing in the large organisations who are setting up their in Hyderabad - @Manisha_saboo, Infosys head. @KTRTRS #TriumphantTelangana pic.twitter.com/EWyUuhsTF8
— AR (@AshokReddyNLG) June 1, 2022
మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు
TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!
Manchu Vishnu: మనోజ్తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?
తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ
అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు