అన్వేషించండి

Hydra Demolitions : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'– హైకోర్టు తీర్పు అమలుతో కబ్జాదారులకు షాక్

Hydra Demolitions : హైడ్రా మిషన్‌ కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న 36 ఎకరాల విలువైన భూమిని అక్రమదారుల నుంచి రక్షించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Hydra Demolitions : హైదరాబాద్‌ మహానగరంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కబ్జాలకు గురైన భూములను రక్షించే ప్రక్రియను హైడ్రా విజయవంతంగా చేస్తోంది. హైడ్రా అధికారులు చేపడుతున్న కఠిన చర్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్‌లో ఏకంగా రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాలను హైడ్రా అధికారులు రక్షించారు.  ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ‘హైడ్రా’ సంస్థ భారీ ఎత్తున కూల్చివేతల ఆపరేషన్‌ చేపట్టింది. ఈ కూల్చివేతలు కేవలం ప్రభుత్వ ఆస్తిని రక్షించడం మాత్రమే కాకుండా, భూ కబ్జాదారులకు బలమైన హెచ్చరికగా నిలిచాయి.

ఆపరేషన్‌ కొండాపూర్‌తో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం 

ఆర్టీఏ కార్యాలయం పక్కనే ఉన్న భిక్షపతి నగర్ ఏరియాలో ఆపరేషన్‌ కొండాపూర్‌ హైడ్రా చేపట్టింది. సర్వే నంబర్ 59లో ఉన్న ఈ 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. వ్యాపార కార్యకలాపాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు అనేక ఫిర్యాదులు వచ్చారు. ఈ ఫిర్యాదులతో కదలిన అధికారులు చర్యలకు ఉపక్రమింంచారు. పకడ్బందీగా ఆక్రమణలు తొలగించారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఈ విచారణలో భాగంగా ఆక్రమణలు తొలగించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా సిబ్బంది ఈ ఆక్రమణల తొలగింపును అత్యంత పకడ్బందీగా చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పూర్తి బందోబస్తుతో ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో కారిడార్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.  తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించారు. అది ప్రభుత్వ భూమి అని చెప్పే బోర్డులు ఏర్పాటు చేశారు. చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు.  

రూ. 3,600 కోట్ల విలువైన భూమి కబ్జా వెనుక ఆంతర్యం

కొండాపూర్ ప్రాంతం హైదరాబాద్‌ నగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అత్యంత విలువైన స్థిరాస్తి మార్కెట్‌లలో ఒకటి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నంబర్‌ 59లోని ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ దాదాపు రూ. 3,600 కోట్లు ఉంటుందని అంచనా.  
 
హైడ్రా చేపట్టిన ఈ ఆక్రమణల తొలగింపులో మరో కోణం వెలుగు చూసింది. తమ భూములు గత 60 ఏళ్లుగా తమ అధీనంలోనే ఉన్నాయని కొంతమంది రైతులు చెబుతున్నారు. భూమిని ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు, వ్యాపారం చేసుకుంటున్న వారు, తాత్కాలిక షెడ్లు వేసుకున్న వారు కాకుండా, ఈ భూమిపై తమకు హక్కు ఉందని రైతులు చెబుతున్నారు.  

అధికారులు హైకోర్టు తీర్పు మేరకు చర్యలు చేపట్టినప్పటికీ, రైతుల 60 ఏళ్ల అధీనంపై ఉన్న వాదన చట్టపరమైన సవాళ్లకు దారి తీసే అవకాశం ఉంది. అయితే, ఈ ఆక్రమణ తొలగింపు చర్య హైకోర్టు ఆదేశాల మేరకు జరగడంతో, ప్రభుత్వపరంగా పాలనాపరమైన చర్యలు వేగంగా పూర్తయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో భూ వివాదాల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు హైడ్రాను పటిష్టం చేసింది. ఎన్ని వివాదాలు, సమస్యలు వచ్చినా ముందుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget