అన్వేషించండి

Hyderabad:ఔషధాల గనిగా రామా ఫలం- హైదరాబాదీ అద్భుత సృష్టి- ఇక్రిశాట్ ఫెయిర్‌లో మూడో బహుమతి

ICRISAT intern awarded in USA: భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తూ అమెరికాలోని ఇంటర్నేషనల్ సైన్సు అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో ప్రదర్శించగా మూడవ బహుమతి గెలుచుకున్నాడు సర్వేశ్ ప్రభు.

ICRISAT intern awarded in USA: మన దేశంలో వివిధ మొక్కలను రోగాల నుంచి రక్షించుక్లోవడానికి ఉపయోగిస్తుంటాం. మరి కొన్ని మొక్కలతో, చెట్లతో పలు వ్యాధులకు చికిత్స కూడా చేస్తుంటారు. వేప చెట్టు ఆకుల నుంచి తయారు చేసే కషాయాన్నిపొలాల్లో చల్లుతూ ఉంటారు. ఇలా ఓ మొక్క నుంచి బయో క్రిమి సంహరకం తయారు చేసి ఔరా అనిపించాడు ఓ కుర్రాడు. ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ సెమి-ఎరిడ్ ట్రాపిక్స్)లో రీసెర్చ్ ఇంటర్న్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో మూడవ బహుమతి పొందాడు. దాంతో పాటు 1000 అమెరికన్ డాలర్లను సైతం అందుకున్నాడు.

హైదరాబాద్ లోని FIITJEE జూనియర్ కాలేజీ లో చదువుతున్న సర్వేశ్ ప్రభు అనే విద్యార్థి కీటకశాస్త్రం విభాగానికి సంబంధించి ఇక్రిశాట్‌లో ప్రయోగాలు చేశాడు. రామాఫలం(రాంఫాల్)గా పిలిచే (Annona reticulata) అనే మొక్క నుంచి క్రిమి కీటకాలను నాశనం చేసే మందును తయారుచేశాడు. భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తూ అమెరికాలోని ఇంటర్నేషనల్ సైన్సు అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్ లో ప్రదర్శించగా మూడవ బహుమతి గెలుచుకున్నాడు సర్వేశ్ ప్రభు.

భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం విద్యార్థి సర్వేశ్ ప్రభుకు అవార్డు సైతం అందించింది. స్కూల్ పిల్లలకు అందించే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇన్నోవేషన్ అవార్డులో భాగంగా అతనికి మొదటి బహుమతితో పాటు రూ.1 లక్ష అందించింది.

రాంఫాల్ చెట్టు ఆకుల నుంచి తయారు చేసే క్రిమి సంహారకాలు కాయ తొలుచు పురుగు, పచ్చ పెను బంక పురుగు, కత్తెర తెగుళ్లను నియంత్రించడానికి దోహదపడతాయి. ఈ క్రిమి సంహారకం వాడగా కీటకాల మరణాల రేటు 78-88 శాతంగా ఉందని పరిశోదనలో తేలింది. ఈ పురుగులు పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కాయ తొలుచు పురుగుల వల్ల ప్రతి ఏటా ౩౦౦ మిలియన్ల డాల్లర్ల నష్టం జరుగుతుందని వ్యవసాయ శాఖ నిపుణులు అంచనా వేశారు. పచ్చ పెను బంక పురుగు వివిధ రకాల పంటల్లో 38-42 శాతం వరకు దిగుబడిని తగ్గిస్తుంది. తెగుళ్లను సరైన సమయానికి గుర్తించి, క్రిమి సంహారక మందులను రైతులు పిచికారీ చేయకపోతే 21- 53 శాతం వరకు పంటకు నష్టం కలిగిస్తుంది. భారత వ్యవసాయ రంగం పై తెగుళ్లు 2018 లో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. మొక్కజొన్న పంట పై చూపిన ప్రభావం వల్ల పౌల్ట్రీ, పశుగ్రాస అవసరాలను తీర్చడానికి వీదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.

ప్రయోగశాలలో 78-88 శాతం వరకు తెగుళ్లతో కూడిన క్రిమి కీటకాల మరణాల రేటును నమోదు చేయడంలో ఇక్రిశాట్ ఇంటర్న్ సర్వేశ్ ప్రభు రూపొందించిన ఈ క్రిమి సంహారకారి దోహదం చేసింది. తరువాత దశలో బయట పరిస్థితుల్లో ఎలా పని చేస్తుందో పరీక్షించి చూడాలి" అని ఇక్రిశాట్ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ సీడ్ హెల్త్ ప్రతినిది రాజన్ శర్మ తెలిపారు. బయో క్రిమి సంహారకాలు ఎటువంటి కృతిమ మందులు వాడకుండా దిగుబడి పొందడానికి దోహదపడతాయి. వీటి వల్ల రైతులకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఇలాంటి ఆవిష్కరణలు అన్నదాతల ముఖాల్లో వెలుగులు నింపుతాయి.

'అనోనా రెటిక్యులాటా యొక్క బయో-క్రిమి సంహారక లక్షణాలపై అధ్యయనం' పేరుతో రూపొందించిన ప్రాజెక్ట్ రాంఫాల్ మొక్క ఆకుల నుంచి తయారుచేసిన క్రిమిసంహారక మందు గురించి తెలుపుతుంది. తక్కువ ఖర్చుతో సంప్రదాయ రీతిలో రూపొందించే ఈ క్రిమి సంహారక మందు పంటలకు పట్టే చీడపీడలతో పాటు తెగుళ్లను నాశనం చేయడంలో రైతులకు ఎంతో ప్రయోజనకారి. ఈ మొక్క వివిధ భాగాలను విరేచనాలు,  పెడిక్యులోసిస్ వంటి వ్యాధుల చికిత్సకు సైతం ఉపయోగిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget