అన్వేషించండి

Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చిని రూ. 11,781 కనీస ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Chandrababu: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కనీస ధరను రూ. రూ. 11,781 గా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటా మిర్చికి ఈ ధర వర్తిస్తుంది. ధరలు భారీగా పడిపోవడంతో రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఇక నుంచి సాగు ఖర్చు.. అమ్మకపు వ్యయం మధ్య వ్యత్యాన్ని కేంద్రం చెల్లిస్తుంది.

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం సాయం           

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయినప్పుడు, రాష్ట్రాలు సాయం కోరితే మద్దతు ధర పథకాల పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాలను భరిస్తుంది. దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పేరు పెట్టారు. కేంద్రం  గిట్టుబాటు ధర  ప్రకటించే వాణిజ్యపంటల జాబితాలో మిర్చి చేర్చకపోవడం వల్ల మిర్చికి ఈ ఫథకాన్ని అమలు చేస్తున్నారు. ఎగుమతులు కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి..ఎగుమతి విధానంపై కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.              

ఎగుమతులు తగ్గిపోవడంతో పడిపోయిన ధర         

ఏపీలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలు పెట్టుబడి ఖర్చులవుతాయి. ఓ ఏడాది క్వింటాల్ గరిష్టంగా రూ.26 వేల వరకు వెళ్లడంతో రైతులు ఈసారి కూడా అధిక ధరలు వస్తాయన్న భావనతో భారీగా సాగు చేశారు.  2024 మార్చి తర్వాత ధర రూ.20వేల నుంచి సగానికి పడిపోవడంతో రైతులు మళ్లీ ధరలు పెరుగుతాయనే ఆశతో కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. అప్పటి నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా స్టోరేజీల్లోనే మిగిలిపోయింది. ఇప్పుడు పదిలక్షల బస్తాల కొత్త పంట కూడా వచ్చి చేరడంతో మొత్తంగా దాదాపు 40 లక్షల బస్తాలు కోల్డ్‌ స్టోరీజీల్లోనే ఉన్నాయి. ఈ కారణంగా కూడా ధరలు తగ్గుతున్నాయి. 

రైతుల కోసం కేంద్రం వద్ద చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు 

మిర్చి రైతులకు మేలు చేసేందుకు వారి పంటలకు సరైన ధర ఇప్పించేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. తర్వాత రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిచంద్రశేఖర్ వంటి వారు కేంద్ర వ్వ్యవసాయశాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. మద్దతు ధరను ప్రకటించేలా చేయగలిగారు. ఈ నిర్ణయంతో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎగుమతలపై కేంద్రం విధించిన కొన్ని ఆంక్షలను తొలిగిస్తే డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.                

Also Read:  ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget