అన్వేషించండి

Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా చేసినట్లుగా కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైకోర్టు వేలంలోనే తాను ఆ భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు.

BRS MLA Kotha Prabhakar Reddy on encroachment Case:  హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా  ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

హైడ్రా ఫిర్యాదు ప్రకారం.. 2014లోనే హెచ్‌ఎండీఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయినప్పటికీ, నిందితులు దాదాపు 5 ఎకరాల చెరువు శిఖం భూమిని మట్టి ,  రాళ్లతో నింపి ఆక్రమించారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఎస్టీఎస్  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే కొనసాగుతున్నాయని, దీని ద్వారా నిందితులు నెలకు సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్ ఇన్-ఆర్బిట్ మాల్ సమీపంలోని ఈ స్థలంలో ఐటీ కంపెనీలు ,  పాఠశాలల వాహనాల పార్కింగ్ నిర్వహిస్తున్నారు.  ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ 5 ఎకరాల అక్రమ ఆక్రమణలను తొలగించి, చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు.
 
అయితే దుర్గం చెరువుకు సంబంధించి తనపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.  తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని గానీ, చెరువు భూమిని గానీ ఆక్రమించలేదని తెలిపారు. సంబంధిత భూమి పూర్తిగా తమ స్వంతమైందని, ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేలా ఇచ్చినట్టు పేర్కొన్నారు.  ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే టీడీఆర్ కూడా మంజూరు అయిందని తెలిపారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయన్నారు.  దుర్గం చెరువులో తాను ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశానని కేసులు పెట్టారని, అయితే వాస్తవానికి అక్కడ తమకూ, ప్రభుత్వానికీ గజం జాగా కూడా లేదని స్పష్టం చేశారు. 

హైడ్రా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని సిబ్బంది సమాచారం ఇచ్చారని, తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు.  అదే ప్రాంతంలో ఉన్న మరో భూమిని తాను 2004లో కొనుగోలు చేశానని, అది FTL పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించానని తెలిపారు. తనపై కావాలనే రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ, “వారి వద్ద నిజమైన ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు చూపించాలి” అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి  సవాల్ విసిరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Feel The Jail: నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
నేరం చేయకుండా జైలుకెళ్లాలని ఉందా? ఖైదీగా మారాలనుందా? - డబ్బులు కట్టి ఉండొచ్చు..ఇవిగో డీటైల్స్
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget