అన్వేషించండి

Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్

Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా చేసినట్లుగా కేసు నమోదు కావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైకోర్టు వేలంలోనే తాను ఆ భూమిని కొనుగోలు చేసినట్లుగా తెలిపారు.

BRS MLA Kotha Prabhakar Reddy on encroachment Case:  హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా  ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

హైడ్రా ఫిర్యాదు ప్రకారం.. 2014లోనే హెచ్‌ఎండీఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయినప్పటికీ, నిందితులు దాదాపు 5 ఎకరాల చెరువు శిఖం భూమిని మట్టి ,  రాళ్లతో నింపి ఆక్రమించారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఎస్టీఎస్  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే కొనసాగుతున్నాయని, దీని ద్వారా నిందితులు నెలకు సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్ ఇన్-ఆర్బిట్ మాల్ సమీపంలోని ఈ స్థలంలో ఐటీ కంపెనీలు ,  పాఠశాలల వాహనాల పార్కింగ్ నిర్వహిస్తున్నారు.  ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ 5 ఎకరాల అక్రమ ఆక్రమణలను తొలగించి, చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు.
 
అయితే దుర్గం చెరువుకు సంబంధించి తనపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.  తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని గానీ, చెరువు భూమిని గానీ ఆక్రమించలేదని తెలిపారు. సంబంధిత భూమి పూర్తిగా తమ స్వంతమైందని, ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేలా ఇచ్చినట్టు పేర్కొన్నారు.  ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే టీడీఆర్ కూడా మంజూరు అయిందని తెలిపారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయన్నారు.  దుర్గం చెరువులో తాను ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశానని కేసులు పెట్టారని, అయితే వాస్తవానికి అక్కడ తమకూ, ప్రభుత్వానికీ గజం జాగా కూడా లేదని స్పష్టం చేశారు. 

హైడ్రా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని సిబ్బంది సమాచారం ఇచ్చారని, తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు.  అదే ప్రాంతంలో ఉన్న మరో భూమిని తాను 2004లో కొనుగోలు చేశానని, అది FTL పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించానని తెలిపారు. తనపై కావాలనే రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ, “వారి వద్ద నిజమైన ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు చూపించాలి” అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి  సవాల్ విసిరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Advertisement

వీడియోలు

BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget