అన్వేషించండి

Husky Dogs: ఖరీదైన హస్కీ కుక్కల్ని పెంచి రోడ్డున వదిలేశారు - కాపాడిన స్వచ్చంద సంస్థలు - ఎవరి పని?

dogs abandoned: అత్యంత ఖరీదైన సైబీరియన్ హస్కీ జాతికి చెందిన 40 కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ఒక ట్రక్కులో తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. వాటిని స్వచ్చంద సంస్థ సభ్యులు కాపాడారు.

Expensive husky dogs abandoned: నగర శివార్లలోని శంకర్ పల్లి-పటాన్‌చెరు రహదారిపై అత్యంత దారుణమైన జంతు హింస వెలుగుచూసింది. మంచు ప్రదేశాల్లో పెరిగే అత్యంత ఖరీదైన  సైబీరియన్ హస్కీ  జాతికి చెందిన సుమారు 40 కుక్కలను గుర్తుతెలియని వ్యక్తులు ఒక ట్రక్కులో తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశారు. తీవ్రమైన ఎండలు, ఆహారం, నీరు లేక ఆ మూగజీవాలు అల్లాడిపోయాయి.  ఈ విషయం తెలిసిన స్వచ్చంద సంస్థల  సభ్యులు తక్షణమే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకునే సమయానికే పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అప్పటికే ఒక కుక్క ప్రాణాలు కోల్పోగా, మరికొన్ని కుక్కలు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశాయి. కొంతమంది దారి వెంట వెళ్లేవారు మరికొన్ని కుక్కలను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

నిజానికి హస్కీలు చల్లని వాతావరణంలో మాత్రమే జీవించగలవు. వాటిని పెంచుకునేవారు ఏసీ రూముల్లో ఉంచి చూసుకుంటారు. అయితే వీటిని ఇలా రోడ్డుపై వదిలేయడంతో  మండుతున్న ఎండలు వాటి ప్రాణాలకు ముప్పుగా మారాయి. రెస్క్యూ టీమ్ పట్టుకోగలిగిన ఆరు కుక్కలను సురక్షితంగా రక్షించి, తమ షెల్టర్ హోమ్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు. అడవిలోకి వెళ్లిన మిగిలిన కుక్కల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అసలు ఇన్ని కుక్కలను ఒకేసారి ఎవరు, ఎందుకు వదిలేశారనే కోణంలో విచారణ జరుగుతోంది.
 
నిజానికి సైబీరియన్ హస్కీలు అంటే మార్కెట్‌లో వేల రూపాయల ఖరీదు చేసే జాతి. ఇంత భారీ సంఖ్యలో, సుమారు 40 కుక్కలను రోడ్డుపై వదిలేశారంటే దీని వెనుక ఏదైనా  ఇల్లీగల్ బ్రీడింగ్ సెంటర్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. లాభాల కోసం కుక్కలను మిషన్లలా వాడేసి, అవి వయసు పైబడటమో లేదా అనారోగ్యానికి గురికావడమో జరిగితే, వాటి పోషణ భారం అనిపించి ఇలా నిర్దాక్షిణ్యంగా రోడ్డు పాలు చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.   ఏదైనా బ్రీడింగ్ యూనిట్ ప్రభుత్వం పట్టుకుంటుందనే భయంతో రాత్రికి రాత్రే ఇలా ట్రక్కులో తెచ్చి పారేసి ఉంటారని జంతు ప్రేమికులు అనుమానిస్తున్నారు.

 ఈ కుక్కల మెయింటెనెన్స్ చాలా ఖరీదైన వ్యవహారం. వీటికి ఏసీ వాతావరణం, ఖరీదైన ఆహారం అవసరం. ప్రస్తుత వేసవిలో ఏసీ ఖర్చులు, పెరుగుతున్న నిర్వహణ భారమై భరించలేక యజమానులు చేతులెత్తేసి ఉండవచ్చు. అయితే, విక్రయించడానికి ప్రయత్నిస్తే దొరికిపోతామనే భయంతోనో, లేక చట్టపరమైన చిక్కులు వస్తాయనో ఇలా గాలికి వదిలేసి ఉంటారని భావిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget