అన్వేషించండి

CM KCR: ఆ రోజులు పోయాయి, ఇప్పుడు పని చేసేవాడికే గుర్తింపు, అభివృద్ధే గెలిపిస్తుంది: సీఎం కేసీఆర్

CM KCR: తాతలు, తండ్రుల పేర్లు చెబితే ప్రజలు ఓట్లేయరని, అస్సలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనం చేసిన అబివృద్ధే మనల్ని గెలిపిస్తుందంటూ కామెంట్లు చేశారు. 

CM KCR: పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంత కర్తలు, తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఓట్లేయమంటే ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు పేర్లతో పని లేదని. పని చేయగల్గిన వాళ్లతోనే పని అంటూ చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కేంద్రంలో పాలన నిర్లక్ష్యంగా, దశ దిశ లేకుండా కొనసాగుతోందని విమర్శించారు. ఈ తీరు దేశ భవిష్యత్తును నాశనం చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆదివారం ప్రగతి భవన్ లో మధ్య ప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సహా 200 మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చాంద్వాడా జిల్లా జున్నార్ దేవ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ ముస్కోలే తదితరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ప్రకృతి వనరులు అన్నీ ఉన్నా.. రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు!

దేశంలో వ్యవసాయం చేసేందుకు కావాల్సిన ప్రకృతి వనరులన్నీ అందుబాటులో ఉన్నాయని.. అయినా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే  రైతులకు బతుకులు ఇలా మారాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బహుజనులు సహా అన్ని వర్గాల ప్రజలు అప్పటికీ అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితి పోవాలంటే కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకునే దిశగా ప్రజలు చైతన్యం కావాలన్నారు. ఒక పార్టీని ఓడించి ఇంకో పార్టీని గెలిపిస్తే... పార్టీలు, వాటి నాయకుల పేర్లే మారుతాయని అన్నారు. ప్రజలకు ఒరిగేదేమీ లేదని.. పని విధానంలో మార్పు తీసుకువచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు

బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. దేశాన్ని మార్చేందుకు ఏర్పాటు చేసిన ఒక మిషన్ అని వెల్లడించారు. మన కోసం పని చేసుకునే వారికి ఓటు వేస్తేనే మన ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు మధ్యప్రదేశ్ లో ఎందుకు అమలు కావని ప్రశ్నించారు. ఆదివాసీలు, దళితులు, బహుజనులు పీడితులుగానే కొనసాగే దుస్థితి ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆ వర్గాల వారు ఉత్తర భారతంలో కనీస జీవన ప్రమాణాలకు నోచుకోకుండా వివక్షకు గురవుతున్నారని తెలిపారు. తప్పుడు వాగ్దానాలతో, విద్వేషాలు రెచ్చగొడుతూ ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కొనసాగుతున్న దుర్మార్గాలను నిలువరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీని ద్వారానే ఆ రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి తమ పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని కొత్తగా చేరిన నేతలకు సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget