అన్వేషించండి

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌

Amrit Bharat Express: చర్లపల్లి- తిరువనంతపురం మధ్య అమృత్ భారత రైలును శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతి మంగళవారం ఈ ట్రైన్ నడవనుంది.

Amrit Bharat Express: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మారుస్తూ సామాన్య ప్రయాణికులకు కూడా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా కేరళ రాజధానికి అనుసంధానిస్తూ సరికొత్త అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారల్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నుంచి తిరువనంతపురం నార్త్‌ (కోచువేలి) మధ్య నడవనున్న ఈ వీక్లీ సర్వీస్‌ దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలిపే ఒక వారధిగా నిలవనుంది. 

ప్రధాని చేతుల మీదుగా చర్లపల్లి- తిరువనంతపురం అమృత్‌ భారత్ రైలు ప్రారంభం 

జనవరి 23న ఈ వీక్లీ రైలును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పుత్తరికాండం మైదానం  వేదికగా ఉదయం 10.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున 06308 అనే ప్రత్యేక నెంబర్‌తో ఇనాగురల్ సర్వీస్‌ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. ఈ వేదికపై నుంచే మూడు అమృత్‌ భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు.

అమృత్ భారత్ రైలు అత్యాధునిక పుష్‌పుల్‌ సాంకేతికతతో నడుస్తుంది. ఇది వేగవంతమైన ప్రయాణానికి తోడ్పడుతుంది. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్‌ సెకండ్ క్లాస్ కోచ్‌లు సామాన్య ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన దివ్యాంగ్జన్‌ ఫ్రెండ్లీ కోచ్‌లు ప్రత్యేకం. 

ప్రయాణం మార్గం- తెలుగు రాష్ట్రాలతోపాటు  ఆగే స్టేషన్లు ఇవే 

చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య సుమారు 1488 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 31 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక స్టేషన్‌లలో ఆగనుంది. తెలంగాణలో చర్లపల్లిలో బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగుతుంది.  ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు,రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా కేరళలోని పాలక్కాడా, త్రిసూర్‌, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొల్లం, వర్కల స్టేషన్‌లలో ఆగుతూ గమ్య స్థానానికి చేరుకుంటుంది. మొత్తం మీద 29 స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది. 

Image

ఈ రైలు ప్రారంభం కావడంతో కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు గొప్ప వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు గురువాయర్‌ దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని చూడాలనుకునే భక్తులకు ఇది వరంగా మారనుంది. చర్లపల్లి నుంచి ఇప్పటికే ముజఫర్‌పూర్‌ వరకు అమృత్‌ భారత్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దక్షిణ భారతాన్ని కలిపే మరో సర్వీస్ వచ్చింది.           

ఈ రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ఇది ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ప్రతి బుధవారం తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.                      

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget