అన్వేషించండి

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌

Amrit Bharat Express: చర్లపల్లి- తిరువనంతపురం మధ్య అమృత్ భారత రైలును శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతి మంగళవారం ఈ ట్రైన్ నడవనుంది.

Amrit Bharat Express: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మారుస్తూ సామాన్య ప్రయాణికులకు కూడా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా కేరళ రాజధానికి అనుసంధానిస్తూ సరికొత్త అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారల్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నుంచి తిరువనంతపురం నార్త్‌ (కోచువేలి) మధ్య నడవనున్న ఈ వీక్లీ సర్వీస్‌ దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలిపే ఒక వారధిగా నిలవనుంది. 

ప్రధాని చేతుల మీదుగా చర్లపల్లి- తిరువనంతపురం అమృత్‌ భారత్ రైలు ప్రారంభం 

జనవరి 23న ఈ వీక్లీ రైలును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పుత్తరికాండం మైదానం  వేదికగా ఉదయం 10.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున 06308 అనే ప్రత్యేక నెంబర్‌తో ఇనాగురల్ సర్వీస్‌ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. ఈ వేదికపై నుంచే మూడు అమృత్‌ భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు.

అమృత్ భారత్ రైలు అత్యాధునిక పుష్‌పుల్‌ సాంకేతికతతో నడుస్తుంది. ఇది వేగవంతమైన ప్రయాణానికి తోడ్పడుతుంది. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్‌ సెకండ్ క్లాస్ కోచ్‌లు సామాన్య ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన దివ్యాంగ్జన్‌ ఫ్రెండ్లీ కోచ్‌లు ప్రత్యేకం. 

ప్రయాణం మార్గం- తెలుగు రాష్ట్రాలతోపాటు  ఆగే స్టేషన్లు ఇవే 

చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య సుమారు 1488 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 31 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక స్టేషన్‌లలో ఆగనుంది. తెలంగాణలో చర్లపల్లిలో బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగుతుంది.  ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు,రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా కేరళలోని పాలక్కాడా, త్రిసూర్‌, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొల్లం, వర్కల స్టేషన్‌లలో ఆగుతూ గమ్య స్థానానికి చేరుకుంటుంది. మొత్తం మీద 29 స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది. 

Image

ఈ రైలు ప్రారంభం కావడంతో కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు గొప్ప వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు గురువాయర్‌ దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని చూడాలనుకునే భక్తులకు ఇది వరంగా మారనుంది. చర్లపల్లి నుంచి ఇప్పటికే ముజఫర్‌పూర్‌ వరకు అమృత్‌ భారత్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దక్షిణ భారతాన్ని కలిపే మరో సర్వీస్ వచ్చింది.           

ఈ రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ఇది ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ప్రతి బుధవారం తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.                      

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
భైంసాలో విషాదం!2వ అంతస్తు నుంచి పడి రెండేళ్ల పాప మృతి!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court On Fatima Owaisi College: ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
ఫాతిమా ఒవైసీ కాలేజీ సల్కం చెరువు FTL పరిధిలో లేదన్న ప్రభుత్వం! హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Youtuber Ravan Case: రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
రెండో రోజు రావణ్ ఇంట్లో పోలీసుల సోదాలు! పలు దస్త్రాలు, రికార్డులు స్వాధీనం!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Akhil Akkineni : అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
అప్పుడు అఖిల్... ఇప్పుడు సమంత - లెనిన్ బ్లాక్ బస్టర్ కావాలంటూ...
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇప్పటివరకు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌కు వెళ్లిన 31 కార్లు - ఏవి 5 స్టార్, ఏవి 4 స్టార్ సాధించాయి?
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఏయే కార్లకు 5 స్టార్ రేటింగ్? పూర్తి జాబితా ఇదే
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
TVK Govt Asks State Election Commissioner to Step Down: తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
తమిళనాడులో జగన్ మార్క్ పాలిటిక్స్ - ఎస్ఈసీ వర్సెస్ సీఎం విజయ్.. ఆనాటి నిమ్మగడ్డ ఎపిసోడ్ రిపీట్ అవుతోందా?
Embed widget