అన్వేషించండి

Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌

Amrit Bharat Express: చర్లపల్లి- తిరువనంతపురం మధ్య అమృత్ భారత రైలును శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతి మంగళవారం ఈ ట్రైన్ నడవనుంది.

Amrit Bharat Express: భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మారుస్తూ సామాన్య ప్రయాణికులకు కూడా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా కేరళ రాజధానికి అనుసంధానిస్తూ సరికొత్త అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌ శివారల్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ నుంచి తిరువనంతపురం నార్త్‌ (కోచువేలి) మధ్య నడవనున్న ఈ వీక్లీ సర్వీస్‌ దక్షిణ భారత దేశంలోని నాలుగు రాష్ట్రాలను కలిపే ఒక వారధిగా నిలవనుంది. 

ప్రధాని చేతుల మీదుగా చర్లపల్లి- తిరువనంతపురం అమృత్‌ భారత్ రైలు ప్రారంభం 

జనవరి 23న ఈ వీక్లీ రైలును ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేరళలోని తిరువనంతపురంలోని పుత్తరికాండం మైదానం  వేదికగా ఉదయం 10.45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం రోజున 06308 అనే ప్రత్యేక నెంబర్‌తో ఇనాగురల్ సర్వీస్‌ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. ఈ వేదికపై నుంచే మూడు అమృత్‌ భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు.

అమృత్ భారత్ రైలు అత్యాధునిక పుష్‌పుల్‌ సాంకేతికతతో నడుస్తుంది. ఇది వేగవంతమైన ప్రయాణానికి తోడ్పడుతుంది. ఈ రైలులో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్‌ సెకండ్ క్లాస్ కోచ్‌లు సామాన్య ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఒక ప్యాంట్రీ కార్ ఉంటుంది. ముఖ్యంగా దివ్యాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన దివ్యాంగ్జన్‌ ఫ్రెండ్లీ కోచ్‌లు ప్రత్యేకం. 

ప్రయాణం మార్గం- తెలుగు రాష్ట్రాలతోపాటు  ఆగే స్టేషన్లు ఇవే 

చర్లపల్లి నుంచి తిరువనంతపురం మధ్య సుమారు 1488 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 31 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కీలక స్టేషన్‌లలో ఆగనుంది. తెలంగాణలో చర్లపల్లిలో బయల్దేరి నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగుతుంది.  ఆంధ్రప్రదేశ్‌లో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు,రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది. తమిళనాడులోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు మీదుగా కేరళలోని పాలక్కాడా, త్రిసూర్‌, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, కొల్లం, వర్కల స్టేషన్‌లలో ఆగుతూ గమ్య స్థానానికి చేరుకుంటుంది. మొత్తం మీద 29 స్టేషన్‌లలో ఈ రైలు ఆగుతుంది. 

Image

ఈ రైలు ప్రారంభం కావడంతో కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు గొప్ప వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు గురువాయర్‌ దర్శనానికి వెళ్లే భక్తులకు, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని చూడాలనుకునే భక్తులకు ఇది వరంగా మారనుంది. చర్లపల్లి నుంచి ఇప్పటికే ముజఫర్‌పూర్‌ వరకు అమృత్‌ భారత్ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దక్షిణ భారతాన్ని కలిపే మరో సర్వీస్ వచ్చింది.           

ఈ రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడుస్తుంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ఇది ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. ప్రతి బుధవారం తిరువనంతపురం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.                      

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!
Advertisement

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget