అన్వేషించండి

Minister KTR : పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదు, ప్రజల ప్రశంసలు దక్కడం సవాలే- మంత్రి కేటీఆర్

Minister KTR : దేశంలో తెలంగాణ అత్యుత్తమమైన రాష్ట్రం అని కేంద్రం అవార్డులు ఇస్తున్నా, కేంద్రంలోని నాయకులే పాలన సరిగాలేదని అబద్దాలు ఆడుతున్నారని మంత్రి కేటీఆర్ విరమర్శించారు.

Minister KTR : స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన పురపాలికల ప్రజాప్రతినిధులు, కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలన్నారు.  దేశంలోనే అత్యధికంగా అవార్డులు సాధించి తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.  ఈ అవార్డులు సాధించేందుకు కింది స్థాయిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలి నుంచి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వరకు అందరూ కలిసి ఒకే రకమైన ఆలోచన విధానంతో పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. జాతీయస్థాయిలో ఇంత గొప్ప గుర్తింపు లభించిందన్నారు. 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం చెబుతుందన్న కేటీఆర్... పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణలో నిలిచిందన్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యుత్తమమైన రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెబుతుందన్నారు. కానీ ఇక్కడ పరిపాలన సరిగా లేదని అబద్దాలను చెబుతుంది కూడా కేంద్రంలోని నాయకులే అన్నారు. అయితే ఇలాంటి అర్థరహిత విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

పురపాలికలకు రూ.2 కోట్ల చొప్పున ప్రోత్సాహకం 

"ఒకవైపు అవార్డులు, రివార్డులతో పాటు ప్రజల ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణలో స్థానిక సంస్థల విధులను నిర్ణయించడం, నిధులు మంజూరు చేయడం వల్లనే ఇంత ప్రగతి సాధ్యమైంది. ప్రతి గ్రామంలో, మునిసిపాలిటీలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ రోజు తెలంగాణలోని పట్టణాలు, గ్రామాలు గొప్పగా మారాయి. స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ వల్ల ఎంతో మంది మహిళా నాయకులు పురపాలికలకు నాయకత్వం వహిస్తున్నారు. అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు, పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉన్నది. జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించిన 19 పురపాలికలకు రెండు కోట్ల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నాం. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అవార్డులు సాధించిన ఈ 19 పురపాలికలకు చెందిన ఛైర్ పర్సన్లు, కమిషనర్లను అడిషనల్ కలెక్టర్లను స్టడీ టూర్ కి పంపించి, మరిన్ని ఉత్తమ పద్ధతులపై అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తాం. ఇందులోంచి పదిమందిని ఎంపిక చేసి జపాన్, సింగపూర్ లో అధ్యయనానికి పంపిస్తాం." - మంత్రి కేటీఆర్ 

వార్డు ఆఫీసర్ల నియామకం 

పట్టణాలను ప్రజలు మాది అని భావించినప్పుడే అవి అద్భుతంగా అభివృద్ధి సాధిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దిశగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి పురపాలికల్లో  వెజ్ అండ్ నాన్ వెజ్ మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామం, డంప్ యార్డ్ ల బయో మైనింగ్, మాస్టర్ ప్లాన్, మోడర్న్ దోభి ఘాట్, tsbpaas, మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లు, గ్రీన్ బడ్జెట్ వంటి 10 లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్యం సరిగ్గా అమలుచేస్తే అవార్డులు అవే వెతుకుంటువస్తాయన్నారు. ఎక్కడా కూడా పారిశుద్ధ కార్మికులకు రూ.12 వేలకు తక్కువ జీతం తగ్గకూడదన్నారు. వార్డు ఆఫీసర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 3700 వార్డు ఆఫీసర్ల నియామకం చేస్తున్నామన్నారు. ఖాళీలు లేకుండా మునిసిపల్ సిబ్బంది నియామకం చేస్తున్నామని తెలిపారు.

ఎన్జీటీ తీర్పుపై స్పందిస్తూ  

గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందించిన మంత్రి కేటీఆర్... రాష్ట్రం చేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల పైన మరింత సమగ్రంగా సమాచారం అందిస్తామన్నారు. ట్రైబ్యునల్ కు కొంత సమాచార గ్యాప్ ఉన్నట్టు ఉందన్నారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లను అన్నీ పురపాలికల్లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీంతో అనేక పురపాలికలకు ODF++ rank దక్కాయన్నారు. ప్రతీ యేటా ink@wash అనే ప్రోగ్రాం చేస్తున్నామని తెలిపారు. తద్వారా స్టార్ట్ ఆప్ లకు సపోర్ట్ చేస్తున్నామన్నారు. పురపాలక శాఖ గ్లామర్ డిపార్ట్మెంట్ కాదన్న కేటీఆర్ ఎంత పని చేసినా ప్రజల నుంచి ప్రశంసలు దక్కడం సవాలే అన్నారు.  దేశంలో ఎక్కడ లేని విధంగా స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ వ్యవస్థ తెలంగాణలో ఉందన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget