అన్వేషించండి

CM KCR : అంబేడ్కర్ పేరిట శాశ్వత అవార్డు, ఈ ఏడాది 1.25 లక్షల మందికి దళిత బంధు - సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

CM KCR : హైదరాబాద్ లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు ఒక విప్లవమని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేడ్కర్ పేరిట ఏటా అవార్డు ప్రదానం చేస్తామన్నారు.

CM KCR : హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌ బండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మృతివనాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలోనే ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్, అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్ తో క‌లిసి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అంబేడ్కర్ విశ్వమాన‌వుడు, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజ‌నీన‌మైందన్నారు. అంబేడ్కర్ ఆశయాలు ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి ప‌రిమితమైనవి కావన్నారు. అంబేడ్కర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ‌గారిన జాతుల‌కు ఆశాదీపం అనికొనియాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం 70 సంవ‌త్సరాలు దాటిపోతోందన్నారు. 

అంబేడ్కర్ పేరిట అవార్డు 

తెలంగాణ నూతన స‌చివాయ‌లానికి అంబేడ్కర్ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి రోజు స‌చివాల‌యానికి వ‌చ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలని కోరారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను ఆచ‌ర‌ణలో పెట్టాలన్నారు. ఇది విగ్రహం కాదని, విప్లవమన్నారు. ఈ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదని, తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక అని కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ పేరిట ఒక శాశ్వత‌మైన అవార్డు నెలకొల్పి, దేశంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఇస్తామన్నారు.ఈ అవార్డు పేరిట రూ.51 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి, వచ్చిన రూ.3 కోట్ల వ‌డ్డీతో...దేశంలో ఉత్తమ సేవ‌లందించిన వారికి అంబేడ్కర్ జ‌యంతి రోజున అవార్డులు అంద‌జేస్తామన్నారు. రూ. 51 కోట్లతో శాశ్వత నిధి ఉంటుందన్నారు.  

ప్రజలు గెలిచే రాజకీయం రావాలి 

నేటికీ క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు నిరుపేద‌లు ఎవ‌రంటే ద‌ళితులు అనే మాట విన‌బ‌డుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప‌రిస్థితి మారాలన్నారు. ప్రజ‌లు గెలిచే రాజ‌కీయం రావాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రావ‌డానికి ముందు 10 ఏళ్లు వేరే పార్టీ ఉందని, ద‌ళితుల అభివృద్ధి కోసం కేవలం రూ.16 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ద‌ళితుల అభివృద్ధి కోసం రూ.లక్షా 25 వేల 68 కోట్లు ఖ‌ర్చుచేసిందన్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఏటా 25 ల‌క్షల ద‌ళిత కుటుంబాల‌కు ద‌ళిత‌ బంధును అమ‌లుచేస్తామన్నారు. అంబేడ్కర్ క‌ల‌లు సాకారం కావాలని, త‌ప్పకుండా ఆ రోజు వస్తుందన్నారు. తెలంగాణలో 50 వేల మందికి ద‌ళిత బంధు సాయం అందిందన్నారు. ఈ ఏడాదిలో ల‌క్ష పాతిక వేల మందికి దళిత బంధు అంద‌బోతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేన‌టువంటి ఆద‌ర్శమూర్తి విగ్రహాన్ని తెలంగాణలో తీర్చిదిద్దినందుకు, ఈ అవ‌కాశం త‌న‌కు క‌లిసి వ‌చ్చినందుకు నా జ‌న్మ ధ‌న్యమైందని కేసీఆర్ అన్నారు. అంబేడ్కర్ బాటలో దేశాన్ని నడిపేందుకు చివ‌రి ర‌క్తపు బొట్టు వ‌ర‌కు పోరాటం చేస్తానన్నారు. ఈ విషయంలో రాజీప‌డే ప్రస‌క్తే లేదన్నారు.  

 
"2014కు ముందు పదేళ్లు పాలించిన ప్రభుత్వం దళితుల కోసం 16 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ పదేళ్ళలో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేశాం. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియాలో వచ్చే ప్రభుత్వం మనదే. మన ప్రభుత్వం రాగానే దేశంలో 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు ఇస్తాం. మహారాష్ట్రలో ప్రారంభమైన బీఆర్ఎస్ ప్రభంజనం యూపీ, బెంగాల్, ఒడిశాలో రాబోతోంది. ఈ ఏడాది 1 లక్ష 25 వేల మందికి దళితబంధు ఇవ్వబోతున్నాం. దేశంలో మనం రావాలంటే చీలిపోకుండా కలిసి పోరాటం చేయాలి"- సీఎం కేసీఆర్ 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget