అన్వేషించండి

Ganesh Immersion 2024: గణేష్ నిమజ్జనం ఎఫెక్ట్ - జనసంద్రంగా హుస్సేన్ సాగర్ పరిసరాలు, 10 నిమిషాలకోసారి మెట్రో స్టేషన్‌లోకి ఎంట్రీ

Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. దీంతో మెట్రో స్టేషన్ మూసేసిన అధికారులు 10 నిమిషాలకోసారి గేట్లు తెరుస్తున్నారు.

Huge Crowd In Khairatabad Metro Station: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం అశేష భక్తజనం మధ్య కోలాహలంగా సాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh Immersion) వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వేలాది విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. విపరీతమైన రద్దీతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లను సిబ్బంది మూసేశారు. పది నిమిషాలకోసారి గేట్లు తెరిచి ప్రయాణికులను లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌తో (Khairatabad Metro Station) పాటు బస్టాప్స్ సైతం కిక్కిరిసిపోయాయి. 70 అడుగుల ఖైరతాబాద్ గణేశుని భారీ విగ్రహ నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.

అర్ధరాత్రి వరకూ మెట్రో

అటు, గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సర్వీసులు నడపనున్నట్లు సంస్థ వెల్లడించింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి రైలు బయలుదేరుతుంది. నిమజ్జనం ముగిసే వరకూ ప్రయాణికుల రద్దీ, అవసరం మేరకు అదనపు రైళ్లు నడుపుతామని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఎంఎంటీఎస్ రైళ్లు సైతం అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకూ సర్వీసులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్ - హైదరాబాద్, లింగంపల్లి - ఫలక్‌నుమా, లింగంపల్లి - హైదరాబాద్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్, హైదరాబాద్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - హైదరాబాద్ రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు సీపీ విజ్ఞప్తి

నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బుధవారం ఉదయం వరకూ విగ్రహాలన్నీ నిమజ్జనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తామన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని అన్నారు. బాలాపూర్ వినాయకున్ని కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. నగరంలో దాదాపు లక్ష విగ్రహాలు ఉండొచ్చని వాటిలో 20 వేల నుంచి 30 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులు ప్రజా రవాణా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Balapur Laddu Auction 2024: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర - 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న శంకర్ రెడ్డి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Warangal Airport: జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు
జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్‌పోర్ట్ పూర్తి: రేవంత్‌ రెడ్డితో భేటీ అనంతరం రామ్మోహన్‌ నాయుడు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget