అన్వేషించండి

Bhadrachalam: మళ్లీ ఉప్పొంగుతున్న గోదావరి, మూడో ప్రమాద హెచ్చరిక జారీ - ఈ రూట్స్ అన్నీ బంద్

చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరూ ఏజెన్సీలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది.

భద్రాచలం వద్ద గత నెలలో వచ్చిన వరదలు మర్చిపోక ముందే మరోసారి గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తూ ఉంది. బుధవారం ఉదయం 5 గంటల సమయానికి గోదావరిలో నీటి మట్టం 54.5 అడుగులకు చేరినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది 14 లక్షల 92 వేల 679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తూ ఉంది.

ఈ వరద ప్రభావంతో సమీపంలోని కొన్ని పలు మండలాలు జలదిగ్భందంలోకి వెళ్లాయి. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరూ ఏజెన్సీలోనూ గోదావరి వరద ఉధృతి పెరిగింది. భద్రా‌చలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహ‌దా‌రిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవ‌హిం‌చ‌డంతో రాక‌పో‌క‌లు పూర్తిగా ఆగిపోయాయి. భద్రా‌చలం నుంచి ఛత్తీ‌స్‌‌గఢ్‌, ఒడిశా ప్రాంతా‌లకు వెళ్లే‌ప్రధాన రహ‌దా‌రిపై నెల్లి‌పాక వద్ద వరద నీరు చేర‌డంతో రాక‌పో‌కలు పూర్తిగా స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు కూడా నీట మునిగాయి. గుండేటివాగు కల్వర్టు మునగడంతో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. 

కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం
కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వంశధార-నాగావళి నదుల వరద ప్రవాహం పెరిగింది. గొట్టా బ్యారేజ్‌ వద్ద ఔట్‌ఫ్లో 30,712 క్యూసెక్యులుగా ఉంది. అయితే, గత వారంతో పోలిస్తే కాస్త తగ్గడంతో ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం మెల్లగా తగ్గుతోంది. గతకొంతకాలంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజికి భారీగా వరద నీరు చేరింది. రెండుమూడు రోజులుగా వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం కూడా అతి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి 2,85,055 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 60 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి  2,70,100 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. అలాగే మరో 14,955 క్యూసెక్కుల నీటిని ఏలూరు, బందరు కాలువలకు విడుదల చేస్తున్నారు. 

దవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో కూడా అంతే ఉంది. ముంపు గ్రామాల్లోని సహాయక చర్యల్లో భాగంగా మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్, ఐయినవిల్లి, మామిడి కుదురులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు  సహాయక చర్యలు కొనసాస్తున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్, విఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం చర్యలు అందిస్తోంది. 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..!

కృష్ణా నదికి కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. వంశధార - నాగావళి నదులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే గొట్టా బ్యారేజ్ వద్ద ఔట్ ఫ్లో 30,712 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గే వరకు నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలయినంత వరకు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని చెబుతున్నారు. 

ఆదివారం నుంచి జల దిగ్బంధంలోనే గ్రామాలు..

మూడు రోజుల కిందట.. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారేజీలో నీటిమట్టం 14.90  అడుగులు ఉండగా.. సముద్రంలో14,62,217 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు నీటి మట్టం 14.80కు చేరుగా.. కడలిలోకి 14,44,414 క్యూసెక్కుల నీటని వదిలారు. దీని వల్ల కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోన్ని చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ క్రమంలోనే 3 ఎస్డీఆర్ఎఫ్, 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ప్రస్తుతం సహాయక చర్యలు అందిస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
Ather Rizta Z 2.9kWh స్కూటర్ కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
Ather Rizta Z 2.9kWh స్కూటర్ కొనే ముందే మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
Embed widget