అన్వేషించండి

Summer Alert : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు - పాఠశాలల సమయాల్లో మార్పులు!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం రోజు రోజుకీ పెరిగిపోతుంది. వడ గాల్పులు తీవ్రమవుతున్నాయి. మార్చి నెలలోనే ఎండలు 43 డిగ్రీలు దాటేస్తున్నాయి. దీంతో ఏప్రిల్‌, మే నెలలో ఎండలు మరింత తీవ్రంగా ఉండొచ్చని వాతావరణ కేంద్రాలు అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణలో పదేళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మరో నాలుగు రోజులు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 

తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. రాయలసీమ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. విజయవాడ, విశాఖలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. 

తెలంగాణలో

ఎండా కాలం తెలంగాణలో ( Telangana ) ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. రానున్న నాలుగు రోజుల్లో ఉత్తర తెలంగాణా జిల్లాలతోపాటు నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో రెండు నుండి నాలుగు డిగ్రీల మేరకు ఉష్టోగ్రతలు ( Summer Heat )పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇలా అనూహ్యంగా పెరగడం వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఎండ తీవ్రత.. ప్రజలను అప్రమత్తం చేసే అంశంగా సోమేష్ కుమార్ ( CS Somesh Kumar )కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారుల అప్రమత్తం

జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ( Summer )మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ (Weather) హెచ్చరించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.  రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అన్ని ఆసుపత్రుల్లో వైదులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని సోమేష్ కుమార్ ఆదేశించారు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను ( ORS pockets )అందుబాటులో ఉంచాలని అన్నారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఎండల ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలపై తీసుకోవాల్సిన  జాగ్రత్తలపై ప్రజలను చైతన్య ప్రర్చాలని సి.ఎస్. కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. 

పాఠశాలల సమయాల్లో మార్పులు

తెలంగాణలో పాఠశాలలు ఉదయం 11.30 గంటల వరకే నడపనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. గురువారం నుంచి ఉదయం 11.30 గంటల వరకే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి. ఈవిధంగా ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పాటించాలని విద్యాశాఖ ఆదేశాల్లో తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Telangana డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Telangana Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget