అన్వేషించండి

Dubbaka Politics: కొత్త బస్టాండ్‌ రేపిన చిచ్చు! దుబ్బాకలో మరింత ముదిరిన వివాదం - పోలీసుల భారీ బందోబస్తు

ఆ బస్టాండు ఏర్పడినందుకు తామంటే తామే కారణమని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కొత్త బస్టాండు క్రెడిట్ తమకే దక్కాలని ఇరు పార్టీల వారు ప్రయత్నిస్తున్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో ఓ బస్టాండు ప్రారంభోత్సవం ఉద్రిక్తతలకు దారి తీసింది. బస్టాండ్‌ కేంద్రంగా దుబ్బాకలో రాజకీయాలు వేడేక్కాయి. కొత్త బస్టాండ్‌ నిర్మిస్తామని ఉప ఎన్నిక సమయంలో హామీగా బీఆర్‌ఎస్‌ (టీఆర్ఎస్), బీజేపీ పార్టీలు చెప్పాయి. అన్న మాట ప్రకారమే రూ.4 కోట్ల ఖర్చుతో ఒక ఏడాదిలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసేశారు. ఆ దుబ్బాక బస్టాండ్‌ను మంత్రి హరీశ్ రావు శుక్రవారం (డిసెంబరు 30) ఉదయం ప్రారంభించారు. 

అయితే, ఇప్పుడు ఆ బస్టాండు ఏర్పడినందుకు తామంటే తామే కారణమని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కొత్త బస్టాండు క్రెడిట్ తమకే దక్కాలని ఇరు పార్టీల వారు ప్రయత్నిస్తున్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం తమను గెలిపించకపోయినా హామీ నిలబెట్టుకున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. కానీ, తాను కొత్త బస్టాండ్ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్లే నిర్మాణం పూర్తయిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు వాదిస్తున్నారు.

ప్రారంభోత్సవ సమయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తలకు మంత్రి హరీష్‌ రావు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లోకి బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలకు ప్రవేశం నిషేధించారు. బస్టాండ్‌ చుట్టూ బారికేడ్లు పెట్టారు. సిద్ధిపేట సీపీ శ్వేతా దుబ్బాక పరిస్థితిని సమీక్షించారు.

దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లతో పాటు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా హాజరయ్యారు. ముందుగా హబ్సిపూర్‌లో గోడౌన్ ప్రారంభించారు. అక్కడి నుంచి దుబ్బాక బస్టాండ్ ప్రారంభించేందుకు రెండు పార్టీల కార్యకర్తలు బైక్ లపై ర్యాలీలుగా వెళ్లారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న సమయంలో మంత్రి హరీశ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు కలగజేసుకొని ఇరు పార్టీల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

ఎంపీ - ఎమ్మెల్యే మధ్య కూడా సవాళ్లు

మరోవైపు, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి మధ్య కూడా సవాళ్లు జరిగాయి. గతంలో దౌల్తాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం ఇరు పార్టీల నేతల మధ్య పెద్ద వివాదాలనే రేపింది. గొల్లపల్లి గ్రామంలో శిలాఫలకంపై స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేరు లేకపోవడం పెద్ద గొడవకు దారి తీసింది. దీనికి తోడు మూడు రోజుల క్రితం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి నేరుగా ఎమ్మెల్యే రఘునందన్ రావు లక్ష్యంగా ఓ సవాలు చేశారు. ఎమ్మెల్యే రఘునందన్​ రావు రాజీనామా చేసి కౌన్సిలర్ గా గెలవాలని​ కామెంట్లు చేయడంతో బీజేపీ శ్రేణుల ఆగ్రహం మరింత పెరిగింది.

రెండు రోజుల క్రితం రైతుల సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో పబ్ లు కావాలని అడిగిన వ్యక్తికి పేద ప్రజలు, రైతుల సమస్యలు తెలియవని ఎంపీ ప్రభాకర రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ధైర్యం ఉంటే మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, బీఆర్ఎస్ గెలుస్తదో, బీజెపీ గెలుస్తుందో తెలుసుకోవాలని సవాలు చేశారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs GT Match Highlights IPL 2025 | కోల్ కతా నైట్ రైడర్స్ పై 39 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP Desa

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Group 1 Exams Schedule: అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
PM Modi-JD Vance Meeting: ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
Embed widget