అన్వేషించండి

Revanth Reddy: రాజకీయాల్లో ఉన్నంత కాలం అధికారంలోకి రానివ్వను - చీరి చింతకు కడతాం - కేసీఆర్‌కు రేవంత్ ఘాటు హెచ్చరికలు

Kodanganl: రాజకీయాల్లో ఉన్నంత కాలం అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్, కేసీఆర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.

CM Revanth Reddy challenged Kcr: నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల ఫ్యామిలీని మళ్లీ అధికారంలోకి రానివ్వను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  80 శాతానికిపైగాసీట్లు సాధించి రెండో సారి అధికారంలోకి వస్తుందన్నారు.  తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎన్నికయిన  సర్పంచ్ ఎన్నికల అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన   భారీ బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.   

వచ్చే 2029 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. "రాసిపెట్టుకోండి.. 2029లో 80 శాతానికి పైగా అసెంబ్లీ సీట్లతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది" అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ, ఇందిరమ్మ రాజ్యం పదేళ్ల పాటు కొనసాగుతుందని, అప్పుడే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, వారి రాజకీయ అస్థిత్వానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.   
 
తన పాలనపై కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి  ఘాటుగా తిప్పికొట్టారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు, ఇప్పుడు అధికారం కోసం దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు. తాను  చనిపోవాలని పదే పదే  కోరుకుంటున్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మంచం మీద నుంచి పడి మక్కెలు విరగ్గొట్టున్నారని..ఆయనను తాను ఏమీ అనలదేన్నారు.   తోలు తీస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రెండేళ్ల పాటు ఫామ్‌హౌస్‌లో ఉండి తోలు తీయడం నేర్చుకున్నారని.. మటన్ కొట్టు మస్తాన్ వద్దకు  రా అని వ్యాఖ్యానించారు. ఎవరి తోలు తీస్తారో తేల్చుకుందామని.. సర్పంచ్‌‌ల వద్దకు రావాలన్నారు.  చింతమడకలో చీరి చింతకు కడతామని  వార్నింగ్ ఇచ్చారు.    

నలభై ఏళ్ల అనుభవం ఉన్న మాటలు మాట్లాడే మాటలేని అవి అని  కేసీఆర్ పైమండిపడ్డారు.  మాకు మాటలు రాక కాదు… మర్యాద ఉండదని మాట్లాడటం లేదన్నారు.  రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నాడు.. ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదు  నేనేం పాస్ పోర్టు బ్రోకర్ దందా చేయలేదు.. అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదు.. మేం కక్షా రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వాళ్లే పోతారని మా పని మేం చేసుకుంటున్నామన్నారు. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. అని సవాల్  చేశారు.  ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం  అన్నారు.  కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి అని పిలుపనిచ్చారు. సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోందన్నారు. 
 

కేసీఆర్ తరహాలో తాను మాట్లాడితే   ఉరేసుకుంటాడాన్నారు.  కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు  తనను జైలుకు పంపడమే కాక తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడన్నారు. అయినా  ఆయన పాపానికి ఆయనే  పోతామని వదిలేశామన్నారు. కేసులు కూడా పెట్టలేదని.. కక్ష సాధింపులకు పాల్పడలేదన్నారు. మా వాళ్ల  మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో పాపాలు చేశారని గుర్తు చేశారు. తానేమీ దుబాయ్ పాస్ పోర్టుబ్రోకర్ గా చేయలేదని.. రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదని రేవంత్ గుర్తు చేశారు. తండ్రీ,కొడుకులు కల్లు కాంపౌండ్ మాటలు మానేసి.. పార్టీ ఆఫీసులో కాదని.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు.  

కేటీఆర్ పైనా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తండ్రి గాలికి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కవితను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డకు చీరపెట్టని వాడు.. చెల్లి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలని  వాడు తనకు సవాల్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఉడత ఊపులకు భయపడేవాడ్నికాదని.. ఎన్ని సార్లు అయినా  అసెంబ్లీ పెడతామని సవాల్ చేశారు.  "ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కొడంగల్ బిడ్డగా నేను చెబుతున్నా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ కనుమరుగు కావడం ఖాయం" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి  ఉంటుందని హామీ  ఇచ్చారు.  


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget