అన్వేషించండి

Telangana News : బీఆర్ఎస్‌కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్సీ !

కాంగ్రెస్ లో చేరాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈయన నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన వారు.

 

Telangana News :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి.  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు త్వరలో పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో బీఆర్ఎస్ నుంచి  మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూలుకు చెందిన భారత రాష్ట్ర సమితి   సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు.  కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు అయన రంగం సిద్ధం చేసుకున్నారు.                                                                        

భారత రాష్ట్ర సమితి తరపున  నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉన్నారు. ఆయనతో సరిపడకపోవడంతో  పార్టీ మారాలని నిర్ణయించారు. పార్టీ హైకమాండ్ కూడా మర్రి జనార్ధన్ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారు.  ఇరువురు మద్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం  అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో కలత చెందిన దామోదర్‌ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు.                              

అయితే దామాదర్‌ రెడ్డి చేరిక పట్ల సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు  ఆయనను ఒప్పించే బాధ్యతను పార్టీ అగ్ర నేత జానారెడ్డికి అప్పగించినట్లు సమాచారం. గతంలో జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు జరపనున్నట్లుగా తెలు్సతోంది.  నాగంకు నచ్చజెప్పి దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకునేందుకు లైన్‌ క్లియర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో ఇక్కడి సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగే భారీ బహరంగ సభలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు.                                          

నాగర్‌ కర్నూలు నియోజక వర్గం లోని తాడూరు మండలానికి చెందిన దామోదర్‌ రెడ్డి  బీఆర్ఎస్‌లో  చేరక ముందు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల తరపున శాసనమండలికి ఎంపికై ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.  తెలుగుదేశం పార్టీ తరపున నాగం జనార్ధన్ రెడ్డి కీలకంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఆయనకు ప్రత్యర్థిగా దామోదర్ రెడ్డి ఉండేవారు. ఈ కారణంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేరికను నాగం స్వాగతిస్తే.. సమస్య పరిష్కారమైనట్లే. లేకపోతే  ఆయన పార్టీ మార్పు వల్ల బీఆర్ఎస్ పార్టీలో తగ్గిపోయే వర్గపోరు..  కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fake Ginger-Garlic Paste : బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
బయట అమ్మే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా? అవయవాలు కుళ్లిపోతాయా?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
CM Revanth Reddy: గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
గల్ఫ్ దేశాల్లోని తెలుగువారు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: రేవంత్ రెడ్డి సూచనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Embed widget