అన్వేషించండి

BRS News: మహిళలను సీఎం అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే - బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

Telangana News:అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA's : బడ్జెట్ పై కేటీఆర్ నిజాలు మాట్లాడుతుంటే.. దానిని డైవర్ట్ చేసేందుకనే సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి ,సునీత లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటినుంచి ప్రజా పాలన ,ఇందిరమ్మ పాలన అని ఊదర గొడుతున్నారని ఆరోపించారు.  మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చాయి. మహిళలు రాష్ట్రంలో భయం తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల పై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో నేను ప్రస్తావిస్తుంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీ లో నిలబడితే సీఎం అధికార పక్షం వాళ్లు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు. నాడు వైఎస్ ,చంద్రబాబు ,కేసీఆర్ లను సీఎం లుగా చూశాము. వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు. ఎస్సీ వర్గీకరణ పై కోవా లక్ష్మి మాట్లాడాలి అనుకుంటే ఆమె కు కూడా మైక్ ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదన్నారు. గతం లో ఇలా ఎపుడూ లేదు. స్పీకర్ కూడా మా వినతి ని పట్టించుకోలేదు. అంబెడ్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు. కనీసం దాన్ని పాటించలేదన్నారు. మా పేరు తీసుకున్నపుడు మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పి పదవి మా వల్ల పోయింది అంటూ ఆరోపిస్తున్నారు. 
 
ఎంత మంది పార్టీలు మారలేదు 
అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరు ను సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు. రాహుల్ గాంధీ రేవంత్ ను నమ్ముకున్నారు ..ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా ?.. సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా ?.. మహిళల పై అత్యాచారాల గురించి రేపు సభ లో లేవనెత్తుతాం .మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. మహిళల పై జరుగుతున్న ఆఘాయిత్యాల పై ప్రభుత్వం సమాధానం గురించి పట్టు బడతామని ప్రకటించారు.  ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీ ఆర్ ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి.  మా ఎమ్మెల్యేలను పొలిసు వాహనాల్లో తెలంగాణ భవన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారు .కాంగ్రెస్ కాదని సబితమ్మ వాపోయారు.

అవమానం బాధాకరం

ఈ రోజు మాకు శాసన సభ లో జరిగిన అవమానం బాధాకరమని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నాలుగున్నర గంటలు సభ లో మేము నిల్చున్నా పాలక పక్షం స్పందించక పోగా హేళన చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అసెంబ్లీలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయన్నారు. మహిళల పై అత్యాచారాలు పెరిపోయాయి ..శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.  నా ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. దళితుల ఓట్ల తోనే మేము గెలిచాం .ఎవరు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కు మేము వ్యతిరేకం అన్నట్టు గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.  

రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
మా సహచర మహిళా ఎమ్మెల్యేలు సబితా , సునీత లను సీఎం రేవంత్ కావాలనే టార్గెట్ చేశారని కోవా లక్ష్మీ తెలిపారు. సీతక్క కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టే ఎమ్మెల్యేలు సబిత ,సునీత లకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే బాగుండేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే సీఎం రేవంత్ కు చిన్న చూపు అని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఘనత తనదే అన్నట్టుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు. అసెంబ్లీ లో తీర్మానం చేయడం తో పాటు పాటు పలు మార్లు ఢిల్లీ లో ప్రధాని ని కలిశారని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. ఓ వైపు ఇందిర సోనియా పేర్లు చెబుతూ రేవంత్ మరొ వైపు మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. సీఎం హోదా కు దగ్గట్టు రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే రేవంత్ కు ఎందుకు భయం ? అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టడం తప్ప సీఎం రేవంత్ కు వేరే పని లేదని కోవా లక్ష్మీ మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేటి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
నేటి నుంచి రెండు రోజులపాటు కడప జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
గురుకుల స్కూల్లో దారుణం.. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కాళ్లు, చేతులు కట్టేసి క్లాస్‌మేట్స్ దాష్టీకం
Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget