అన్వేషించండి

BRS News: మహిళలను సీఎం అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే - బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

Telangana News:అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA's : బడ్జెట్ పై కేటీఆర్ నిజాలు మాట్లాడుతుంటే.. దానిని డైవర్ట్ చేసేందుకనే సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి ,సునీత లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటినుంచి ప్రజా పాలన ,ఇందిరమ్మ పాలన అని ఊదర గొడుతున్నారని ఆరోపించారు.  మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చాయి. మహిళలు రాష్ట్రంలో భయం తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల పై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో నేను ప్రస్తావిస్తుంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీ లో నిలబడితే సీఎం అధికార పక్షం వాళ్లు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు. నాడు వైఎస్ ,చంద్రబాబు ,కేసీఆర్ లను సీఎం లుగా చూశాము. వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు. ఎస్సీ వర్గీకరణ పై కోవా లక్ష్మి మాట్లాడాలి అనుకుంటే ఆమె కు కూడా మైక్ ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదన్నారు. గతం లో ఇలా ఎపుడూ లేదు. స్పీకర్ కూడా మా వినతి ని పట్టించుకోలేదు. అంబెడ్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు. కనీసం దాన్ని పాటించలేదన్నారు. మా పేరు తీసుకున్నపుడు మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పి పదవి మా వల్ల పోయింది అంటూ ఆరోపిస్తున్నారు. 
 
ఎంత మంది పార్టీలు మారలేదు 
అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరు ను సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు. రాహుల్ గాంధీ రేవంత్ ను నమ్ముకున్నారు ..ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా ?.. సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా ?.. మహిళల పై అత్యాచారాల గురించి రేపు సభ లో లేవనెత్తుతాం .మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. మహిళల పై జరుగుతున్న ఆఘాయిత్యాల పై ప్రభుత్వం సమాధానం గురించి పట్టు బడతామని ప్రకటించారు.  ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీ ఆర్ ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి.  మా ఎమ్మెల్యేలను పొలిసు వాహనాల్లో తెలంగాణ భవన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారు .కాంగ్రెస్ కాదని సబితమ్మ వాపోయారు.

అవమానం బాధాకరం

ఈ రోజు మాకు శాసన సభ లో జరిగిన అవమానం బాధాకరమని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నాలుగున్నర గంటలు సభ లో మేము నిల్చున్నా పాలక పక్షం స్పందించక పోగా హేళన చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అసెంబ్లీలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయన్నారు. మహిళల పై అత్యాచారాలు పెరిపోయాయి ..శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.  నా ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. దళితుల ఓట్ల తోనే మేము గెలిచాం .ఎవరు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కు మేము వ్యతిరేకం అన్నట్టు గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.  

రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
మా సహచర మహిళా ఎమ్మెల్యేలు సబితా , సునీత లను సీఎం రేవంత్ కావాలనే టార్గెట్ చేశారని కోవా లక్ష్మీ తెలిపారు. సీతక్క కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టే ఎమ్మెల్యేలు సబిత ,సునీత లకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే బాగుండేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే సీఎం రేవంత్ కు చిన్న చూపు అని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఘనత తనదే అన్నట్టుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు. అసెంబ్లీ లో తీర్మానం చేయడం తో పాటు పాటు పలు మార్లు ఢిల్లీ లో ప్రధాని ని కలిశారని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. ఓ వైపు ఇందిర సోనియా పేర్లు చెబుతూ రేవంత్ మరొ వైపు మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. సీఎం హోదా కు దగ్గట్టు రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే రేవంత్ కు ఎందుకు భయం ? అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టడం తప్ప సీఎం రేవంత్ కు వేరే పని లేదని కోవా లక్ష్మీ మండిపడ్డారు. 

టాప్ హెడ్ లైన్స్

ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget