అన్వేషించండి

BRS News: మహిళలను సీఎం అవమానించారు, క్షమాపణ చెప్పాల్సిందే - బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు

Telangana News:అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

BRS MLA's : బడ్జెట్ పై కేటీఆర్ నిజాలు మాట్లాడుతుంటే.. దానిని డైవర్ట్ చేసేందుకనే సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​లోకి రమ్మనడమే నేను చేసిన తప్పా? అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి ,సునీత లక్ష్మా రెడ్డి ,ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటినుంచి ప్రజా పాలన ,ఇందిరమ్మ పాలన అని ఊదర గొడుతున్నారని ఆరోపించారు.  మహిళలకు ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చాయి. మహిళలు రాష్ట్రంలో భయం తో బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల పై అత్యాచారాలు పెరిగి పోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీ లో నేను ప్రస్తావిస్తుంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మేము నాలుగున్నర గంటలు అసెంబ్లీ లో నిలబడితే సీఎం అధికార పక్షం వాళ్లు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్ళు ఆనందిస్తున్నారు. నాడు వైఎస్ ,చంద్రబాబు ,కేసీఆర్ లను సీఎం లుగా చూశాము. వాళ్ళు మహిళలు ఇన్ని గంటలు నిలబడితే స్పందించేవారు. ఎస్సీ వర్గీకరణ పై కోవా లక్ష్మి మాట్లాడాలి అనుకుంటే ఆమె కు కూడా మైక్ ఇవ్వలేదని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీస స్పందన లేదన్నారు. గతం లో ఇలా ఎపుడూ లేదు. స్పీకర్ కూడా మా వినతి ని పట్టించుకోలేదు. అంబెడ్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించి కూడా చెప్పారు. కనీసం దాన్ని పాటించలేదన్నారు. మా పేరు తీసుకున్నపుడు మేము వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. భట్టి సీఎం పదవి కోసం కొట్లాడాల్సింది పొయి సీఎల్పి పదవి మా వల్ల పోయింది అంటూ ఆరోపిస్తున్నారు. 
 
ఎంత మంది పార్టీలు మారలేదు 
అసెంబ్లీ లొ ఇపుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారు. ఈ రోజు కూడా సీఎం రేవంత్ మమ్మల్ని మళ్ళీ నిందించారు. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరు ను సీఎం తీసుకోవడం ఎంత వరకు కరెక్టు అన్నారు. ఆడబిడ్డలను అవమానించడమే ఈ సీఎం కు నిత్యకృత్యంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం పదవి కున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిదని హితవు పలికారు. రాహుల్ గాంధీ రేవంత్ ను నమ్ముకున్నారు ..ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా ?.. సభలో పురుష ఎమ్మెల్యేలు నిలబడితే అధికార పక్షం తీరు ఇలానే ఉంటుందా ?.. మహిళల పై అత్యాచారాల గురించి రేపు సభ లో లేవనెత్తుతాం .మాకు రేపు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. మహిళల పై జరుగుతున్న ఆఘాయిత్యాల పై ప్రభుత్వం సమాధానం గురించి పట్టు బడతామని ప్రకటించారు.  ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి బీ ఆర్ ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు సబితా ఇంద్రారెడ్డి.  మా ఎమ్మెల్యేలను పొలిసు వాహనాల్లో తెలంగాణ భవన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నామన్నారు. చేవెళ్ల చెల్లెమ్మా అని నన్ను వైఎస్ పిలిచారు .కాంగ్రెస్ కాదని సబితమ్మ వాపోయారు.

అవమానం బాధాకరం

ఈ రోజు మాకు శాసన సభ లో జరిగిన అవమానం బాధాకరమని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నాలుగున్నర గంటలు సభ లో మేము నిల్చున్నా పాలక పక్షం స్పందించక పోగా హేళన చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అసెంబ్లీలో జూనియర్ ఎమ్మెల్యేల మాటలు బాధించాయన్నారు. మహిళల పై అత్యాచారాలు పెరిపోయాయి ..శాంతి భద్రతలు దిగజారాయని తెలిపారు.  నా ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. సీఎం రేవంత్ సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మా మీద సీఎం రేవంత్ ఏదేదో మాట్లాడారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. దళితుల ఓట్ల తోనే మేము గెలిచాం .ఎవరు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ కు మేము వ్యతిరేకం అన్నట్టు గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.  

రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
మా సహచర మహిళా ఎమ్మెల్యేలు సబితా , సునీత లను సీఎం రేవంత్ కావాలనే టార్గెట్ చేశారని కోవా లక్ష్మీ తెలిపారు. సీతక్క కు కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పినట్టే ఎమ్మెల్యేలు సబిత ,సునీత లకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే బాగుండేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే సీఎం రేవంత్ కు చిన్న చూపు అని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఘనత తనదే అన్నట్టుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు. అసెంబ్లీ లో తీర్మానం చేయడం తో పాటు పాటు పలు మార్లు ఢిల్లీ లో ప్రధాని ని కలిశారని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ తెలిపారు. ఓ వైపు ఇందిర సోనియా పేర్లు చెబుతూ రేవంత్ మరొ వైపు మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు. సీఎం హోదా కు దగ్గట్టు రేవంత్ వ్యవహరించడం లేదన్నారు. మహిళా ఎమ్మెల్యేలంటే రేవంత్ కు ఎందుకు భయం ? అన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టడం తప్ప సీఎం రేవంత్ కు వేరే పని లేదని కోవా లక్ష్మీ మండిపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
Abhishek Manu Singhvi assets: కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
కాంగ్రెస్ ఎంపీ సింఘ్వీ - లాయర్‌గానే వందల కోట్ల ఆర్జన -వేల కోట్ల ఆస్తులు !
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget