Breaking News Live: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్గా గిరిజా శంకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా కోన శశిధర్, దేవదాయశాఖ కమిషనర్గా హరిజవహర్లాల్, ఆర్అండ్ఆర్ కమిషనర్గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్కుమార్ నియమితులయ్యారు. తాజా బదిలీలు, నియామకాలపై సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి పవన్ సభకు అనుమతి లేదు : పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కొవిడ్ నిబంధనలు కారణంగా పవన్ బాలాజీపేట బహిరంగసభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేన నేతలకు సూచించామన్నారు. సభాస్థలిని వేరేచోటకు మార్చాలని సూచించారు. ఇప్పటి వరకు ఎవరిని గృహ నిర్భంధం చేయలేదని స్పష్టంచేశారు.
సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు గీత కార్మికుడు మృతి చెందాడు. ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైన సమయంలో తంగళ్ళపల్లి మండలంలోని తాడి చెట్టు వద్ద తన కుల వృత్తి చేసుకోవడానికి వెళ్లిన బండి శేఖర్ గౌడ్ అనే గీత కార్మికుడు చెట్టు కింద నిలుచుని ఉండగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో శేఖర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల శోకాలు మిన్నంటాయి. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఇతర గీత కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు, 10 మరణాలు
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 809 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,160 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,142 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 24 గంటల్లో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ నెల 11న శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న జరిగే గరుడసేవలో సీఎం జగన్ పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. ఈనెల 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించునున్నట్లు ఈవో తెలిపారు.
తెలుగు అకాడమీ స్కామ్లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ అరెస్ట్
తెలుగు అకాడమీ స్కామ్లో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మూడుకు చేరింది. మరికొందర్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. తెలుగు అకాడమీ ఉద్యోగులను విచారిస్తున్నారు.
పవన్ శ్రమదానం వేదిక మార్పు...
రాజమహేంద్రవరంలో శనివారం పవన్కల్యాణ్ శ్రమదానం చేసే వేదిక మారింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని హుకుంపేట బాలాజీపేటకు వేదిక మార్పు చేశారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం పవన్ శ్రమదానం చేపడతారు. కాటన్ బ్యారేజీ వద్ద శ్రమదానానికి జలవనరుల శాఖ అనుమతి నిరాకరించడంతో వేదిక మార్చారు.
బండ్ల గణేష్ సంచలన నిర్ణయం.. నామినేషన్ ఉపసంహరణ
‘మా’ ఎన్నికల్లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తూ ఇప్పటికే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన నామినేషన్ను ఉప సంహరించుకున్నారు. ఈ అనూహ్యమైన ఊహించని పరిణామంపై ఆయన స్పందిస్తూ.. తాను దైవ సమానులుగా భావించే ఓ వ్యక్తి సూచన మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
నా దైవ సమానులు.. నా ఆత్మీయులు.. నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్
— Siddhu SuperHit (@itsmeesiddhu) October 1, 2021
ఉపసంహరించుకున్నాను - బండ్ల గణేష్@ganeshbandla @actorsrikanth @prakashraaj #MAAelections pic.twitter.com/EQk1GU7stB
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ వేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి వినోద్ రావు , హుజూరాబాద్కు చెందిన నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెంట రాగా హుజూరాబాద్లోని ఆర్డీవో కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
నేటి ఉదయం హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 కాగా, నోటిఫికేషన్ వచ్చిన రోజే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉండగా.. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి వినోద్ రావు, హుజూరాబాద్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి వెంట రాగా టీఆర్ఎస్ అభ్యర్థి తన నామినేషన్ వేశారు.
పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ
పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఉదయం పవన్ కల్యాణ్తో వారు సమావేశం అయ్యారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్తో సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే మంత్రి పేర్ని నానితో నిర్మాతలు సమావేశం అయిన సంగతి తెలిసిందే. మళ్లీ పవన్తో వీరంతా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ చేసిన వ్యాఖ్యలకు సినీ పరిశ్రమతో సంబంధం లేదని ఇటీవలే నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets